సీపీఐ ఛలో రాజ్ భవన్ ఉద్రిక్తంగా మారింది. రాజ్ భవన్ కు ర్యాలీగా బయల్దేరిన పార్టీ శ్రేణులను ఖైరతాబాత్ దగ్గర పోలీసులు అడ్డుకున్నారు. దీంతో రెండు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.పోలీసులు అందర్నీ చెదరగొట్టి కూనంనేనిసాంబశివరావు,చాడ వెంకటరెడ్డి సహా పలువురిని అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు. ఈ దేశంలో గవర్నర్ వ్యవస్థనే రద్దు చేయాలని వాళ్లు డిమాండ్ చేశారు.ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్నరాష్ట్రాల్లో బీజేపీ గవర్నర్లతో పెత్తనం చేయిస్తోందని మండిపడ్డారు.