అటు సంచలనం రేపిన సరూర్ నగర్ హత్యపై రాష్ట్ర గవర్నర్ తమిళిసై స్పందించారు. ముస్లిం యువతి ఆశ్రిన్ ను ప్రేమ వివాహం చేసుకున్న నాగరాజు అనే దళితయువకుడిని ఆమె సోదరుడే కిరాతకంగా హత్య చేసిన సంగతి తెలిసిందే. హత్యకు సంబంధించిన వీడియోలు నిన్నటినుంచి సోషల్మీడియాలో వైరల్ అవుతున్నాయి. జాతీయ మీడియాలోనూ దీనిపై చర్చలు మొదలయ్యాయి. మతాంతర వివాహం కాబట్టే అతన్ని హత్య చేశారని తెలిసింది. దీంతో హత్యపై వివరణాత్మక నివేదిక ఇవ్వాలని గవర్నర్ ప్రభుత్వాన్ని కోరారు.
మరికొందరితో కలిసి నాగరాజును వెంటాడి ఇనుపరాడ్డుతో పోడిచి చంపాడు ఆశ్రిన్ సుల్తానా సోదరుడు. రంగారెడ్డి జిల్లా మర్పల్లికి చెందిన బిల్లాపురం నాగరాజు (25), పోతిరెడ్డిపల్లెకు చెందిన ఆశ్రిన్ సుల్తానా (23) కాలేజీ రోజుల నుంచి ప్రేమించుకుంటున్నారు. మతాలు వేరు కావడంతో వీరి పెళ్లికి ఆశ్రిన్ సుల్తానా కుటుంబసభ్యులు ఒప్పుకోలేదు. అయితే జనవరి 31న ఆర్యసమాజ్లో నాగరాజు-ఆశ్రిన్ సుల్తానా వివాహం చేసుకున్నారు. తమకు ప్రాణహాని ఉందని రక్షణ కల్పించాలని పెళ్లికిముందే వికారాబాద్ పోలీసులను ఆశ్రయించారు. తరువాత కొన్నిరోజులకే హైదరాబాద్ వచ్చి ఉంటున్నారు. ఇక్కడ కూడా బాలానగర్ పోలీసులను ఆశ్రయించారు. ఈ తరుణంలోనే బుధవారం నాగరాజు, ఆశ్రిన్ దంపతులు.. బైక్పై ముసారాంబాగ్ వెళ్లి తిరిగివస్తుండగా కొందరు అడ్డుకున్నారు. ఆమె సోదరుడు ఇనుపరాడ్డుతో అతన్ని తలపై మోది, పొడిచి చంపాడు. హత్య చేస్తుండగా కొందరు ఫోన్లలో రికార్డు చేసిన వీడియోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
https://twitter.com/swati_gs/status/1522224276476100608?s=20&t=WV16qPiOm3-wp-KMpoOmjQ
https://twitter.com/swati_gs/status/1522042721321381888?s=20&t=WV16qPiOm3-wp-KMpoOmjQ