తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు కొనసాగుతున్నాయి. మొత్తం 234 అసెంబ్లీ స్థానాలకు ఒకే దశలో పోలింగ్ జరుగుతోంది. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై.. తన సొంత రాష్ట్రమైన తమిళనాడులో ఓటు హక్కును వినియోగించుకున్నారు. చెన్నైలోని విరుగంబాక్కం పోలింగ్ స్టేషన్లో తమిళిసై తన కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు.
ఈ సందర్భంగా మాట్లాడిన తమిళిసై.. ఓటు హక్కు వినియోగించుకోవడం అనేది మన నిబద్దతకు నిదర్శనమన్నారు. ప్రజాస్వామ్యంలో అత్యంత శక్తివంతమైన సాధనం ఇది అన్నారు. అర్హత కలిగి ఉన్న ఓటర్లందరూ.. వారి వారి ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో.. అధికారులు సూచించిన విధంగా నిబంధనలను పాటిస్తూ ఓటు హక్కు వినియోగించుకోవాలని విజ్ఙప్తి చేశారు.