నిర్మల్, నిజామాబాద్ బహిరంగ సభలలో హిందువులపై, దేశంపై యుద్దం ప్రకటించే విధంగా.. దేవీ దేవతలను కించపరిచే విధంగా మాట్లాడిన అక్బరుద్దీన్ కు చట్ట ప్రకారం సరైన శిక్ష పడాలని యావత్తు దేశం కోరుకుంది. కానీ అతనికి శిక్ష పడకపోగా.. అతడిని నిర్దోషిగా వెల్లడించడం ఒక వర్గ ప్రజలను కించపరిచినట్లు అవుతుంది. అక్బరుద్దీన్ కు కఠిన శిక్ష పడేలా న్యాయ స్థానం ముందు సరైన సాక్ష్యాదారాలు ప్రవేశ పెట్టడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం, పోలీసులు పూర్తిగా విఫలమయ్యారు. ఫలితంగా నాంపల్లి ప్రత్యేక న్యాయస్థానం అక్బరుద్దీన్ పై ఉన్న కేసులను కొట్టివేసింది. అక్బరుద్దీన్ కు చట్ట ప్రకారం శిక్ష పడటానికి టీఆర్ఎస్ ప్రభుత్వం నాంపల్లి ప్రత్యేక కోర్టు తీర్పుపై ఉన్నత న్యాయస్థానంలో అప్పీల్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం” అని వీహెచ్పీ అధికార ప్రతినిధి రావినూతల శశిధర్ అన్నారు.
(మైఇండ్ మీడియా ఫేస్బుక్, ట్విటర్, ఇన్స్టాగ్రామ్ను ఫాలో అవ్వండి. యూట్యూబ్ చానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.)