ఉత్తరాఖండ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. సీఎం తిరత్ సింగ్ రావత్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన తీసుకున్న ఈ నిర్ణయం దేశ వ్యాప్తంగా హాట్టాపిక్గా మారింది. విడుతల వారీగా ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ఆలయాలకు విముక్తి కల్గిస్తూ… స్వయంప్రతిపత్తిని కల్గిస్తోంది. ఈ క్రమంలో 51 ఆలయాలపై ప్రభుత్వ అజమాయిషీని తొలగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో బద్రీనాథ్, కేదార్నాథ్, యమునోత్రి, గంగోత్రి సహా పలు ఆలయాలపై ఉన్న ప్రభుత్వ అజమాయిషీని తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం.. చార్ధామ్ దేవస్ధానం బోర్డు ఏర్పాటు నిర్ణయాన్ని రివ్యూ చేస్తామని.. 51కిపైగా ప్రముఖమైన ఆలయాలపై ప్రభుత్వ అజమాయిషీ ఉండదన్నారు.