అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా నిర్వహించే వింధులు, వినోదాలపై కర్ణాటక ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై లేట్నైట్ పార్టీలపై నిషేధం విధిస్తున్నట్లు కర్ణాటక ప్రభుత్వం తెలిపింది. పొరుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు విజృంభిస్తున్న నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తగా లేట్నైట్ పార్టీలపై నిషేధాన్ని విధించింది ప్రభుత్వం. ఈ ఆదేశాలు గురువారం రాత్రి నుంచి అమలు కానున్నట్లు అధికారులు తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం.. హోటళ్లు, ఫంక్షన్ హాల్స్ నడుచుకోవాలంటూ ప్రత్యేక మార్గదర్శకాలను జారీచేసింది.
రాష్ట్రంలో రెస్టారెంట్లు, హోటళ్లు, ఫంక్షన్ హాల్స్.. కరోనా వ్యాప్తికి కేంద్రాలుగా మారకుండా ఉండాలంటే.. ఇలాంటి నిర్ణయాలు తీసుకోక తప్పదని.. రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి కే సుధాకర్ అన్నారు. ప్రభుత్వ తదుపరి ఆదేశాలు వచ్చే వరకు కూడా ఈ నిషేధం అమల్లో ఉంటుందని మంత్రి తెలిపారు.