సంగం బ్యారేజీకి దివంగత మంత్రి మేకపాటి గౌతం రెడ్డి పేరుపెట్టనున్నట్టు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు.నెల్లూరులో గౌతంరెడ్డి సంతాపసభలో పాల్గొన్న సీఎం ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. రాజకీయాల్లోకి తానే తీసుకువచ్చానని… తన కేబినెట్లో పరిశ్రమశాఖ సహా ఆరు శాఖల్ని సమర్థవంతంగా నిర్వహించాడని చెప్పారు. ప్రతీ అంశంలోనూ తన వెంట ఉన్న గౌతం మరణాన్ని ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నానని జగన్మోహన్ రెడ్డి అన్నారు. మే 15 కల్లా సంగం బ్యారేజీని పూర్తి చేసి గౌతమ్ జ్ఞాపకార్థం ఆయన పేరు పెడ్తామనీ ప్రకటించారు. గౌతం తండ్రి , సీనియర్ నేత మేకపాటి రాజమోహన్ రెడ్డిని జగన్ ఓదార్చారు. శ్రీధర్ రెడ్డి, అనిల్, సహా పలువురు మంత్రులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. గౌతం రెడ్డితో అనుబంధాన్ని గుర్తుచేసుకుని నివాళులు అర్పించారు.