ఆదిలాబాద్ లో అక్రమంగా తరలిస్తున్న లేగదూడలను గోరక్షకులు పట్టుకున్నారు. రెండు లేగదూడలను తరలిస్తుండగా పక్కా సమాచారంతో సోనాల, గుట్టపక్క తండా యువకులు వాటిని కాపాడారు. ఏలాంటి అనుమానం రాకుండా రెండు లేగదూడలను మహారాష్ట్ర వైపు పట్టుకెళ్తోండగా వారిని అడ్డగించి విచారించగా.. కబేలాలకు తరలిస్తున్నారని తెలిసింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చి గోవులను గుడిహత్నూర్ గోశాలకు తరలించారు.