అటు గోరఖ్ నాథ్ ఆలయ ఘటన కేసు నిందితుడు ముర్తజాను విచారణలో భాగంగా లక్నో తరలించింది యూపీ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ ఏటీఎస్. అతని నుంచి స్వాధీనం చేసుకున్న ల్యాప్ టాప్, మొబైల్ ఫోన్లను దర్యాప్తు కోసం ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ కు పంపారు అధికారులు.ఇక దర్యాప్తులో నిందితుడు ముర్తజా మూడేళ్ళ నుంచి తన కుటుంబ సభ్యులను కలవలేదని వెల్లడైంది. నిన్న అతని కుటుంబంతో గతంలో నివసించిన నవీ ముంబైలోని ఇంటికి తీసుకెళ్లి విచారణ చేసింది ఏటీఎస్. అటు తన కుమారుడు డిప్రెషన్ తో బాధపడుతున్నాడని..అతని మానసిక స్థితి బాగాలేదని ముర్తజా అబ్బాసీ తండ్రి మునీర్ అబ్బాసీ చెబుతున్నాడు.
ముర్తజా అబ్బాసీ ఆదివారం గోరఖ్నాథ్ మఠం వద్దకు ఓ పెద్ద కత్తితో వచ్చి, విధి నిర్వహణలో ఉన్న పోలీసు సిబ్బందిపై దాడి చేశాడు. బలవంతంగా గోరఖ్నాథ్ దేవాలయంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించాడు. ఈ దాడిలో ఇద్దరు పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు. పారిపోబోతున్న ముర్తజాను పోలీసులు పట్టుకుని ఏటీఎస్ కు అప్పగించారు.
(మైఇండ్ మీడియా ఫేస్బుక్, ట్విటర్, ఇన్స్టాగ్రామ్ను ఫాలో అవ్వండి. యూట్యూబ్ చానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.)