ఎప్పుడెప్పుడా అని ప్రభుత్వ ఉద్యోగాల కోసం నిరీక్షిస్తున్న నిరుద్యోగులకు ప్రధాని నరేంద్ర మోడీ శుభవార్త చెప్పారు. వచ్చే ఏడాదిన్నరలోగా మిషన్ మోడ్లో భాగంగా దేశంలోని వివిధ కేంద్ర ప్రభుత్వ శాఖలు, మంత్రిత్వశాఖల్లో 10లక్షలమందిని రిక్రూట్ మెంట్ చేయాలని ప్రధాని మోదీ మంగళవారం కేంద్ర అధికారులను ఆదేశించారు. అన్ని ప్రభుత్వ శాఖల్లో మానవ వనరుల స్థితిగతులను పరిశీలించిన తర్వాత మోదీ నుంచి ఈ ప్రకటన వచ్చింది. వచ్చే 18 ఏడాదిన్నరలో 10 లక్షల మందికి పైగా ఉద్యోగులను రేసీరియట్ చేయాలని మోదీ దిశానిర్దేశం చేసినట్లు ప్రధాన మంత్రి కార్యాలయం (PMO) తెలిపింది. నిరుద్యోగ సమస్యపై ప్రతిపక్షాలు తరచూ విమర్శలు గుప్పిస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
https://twitter.com/PMOIndia/status/1536558426352123904?s=20&t=etmJeM8uTggJungasNF3Cg