గుడ్న్యూస్.. త్వరలో తగ్గనున్న పెట్రోల్,డీజిల్ ధరలు.. కేంద్రం ప్లాన్ ఇదే!
గత కొద్ది రోజులుగా పెట్రో మంటలు సామాన్య ప్రజల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఎన్నడూ లేనివిధంగా లీటర్ పెట్రోల్ ధర.. సెంచరీ దాటేసింది. డీజిల్ ధరలు కూడా పెట్రోల్తో పోటీపడుతూ సెంచరీ వైపు పరుగులు పెట్టాయి. దీంతో అన్నింటి ధరలు క్రమక్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. ఈ క్రమంలో కేంద్రం పెట్రోల్ ధరలకు బ్రేకులు వేసేందుకు ప్లాన్ వేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇప్పటి వరకు పెట్రోల్,డీజిల్పై విధిస్తున్న ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించే ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. మార్చి నెల మధ్యలో దీనిపై ఓ స్పష్టత వస్తుందని తెలుస్తుంది. అంతేకాదు.. పన్నులు తగ్గించడానికి ముందే.. ఆయిల్ ధరలు నిలకడగా ఉండేలా చూడాలని కూడా ప్రభుత్వం భావిస్తుంది. ఒకవేళ క్రూడాయిల్ ధరలు పెరిగినప్పటికీ.. ఎక్సైజ్ సుంకంలో మార్పులు లేకుండా చూసేందుకు కసరత్తులు చేస్తున్నట్లు తెలుస్తోంది.