సామాన్యులకు గుడ్న్యూస్.. మరో కొత్త స్కీమ్ షురూ..!
కరోనా మహమ్మారి యావత్ ప్రపంచాన్ని వణికిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మోదీ సర్కార్ లోక్సభలో బడ్జెట్2021ను ప్రవేశ పెట్టింది. ఓ వైపు కరోనా మహమ్మారిపై యుద్ధం
చేస్తూనే.. మరోవైపు సామాన్య ప్రజలకు భారీగా ఊరట కల్పించేలా ఈ బడ్జెట్ను ప్రవేశ పెట్టారు. ఏప్రిల్ 1వ తేదీ నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ
నేపథ్యంలోనే కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభలో బడ్జెట్ను ప్రవేశపెట్టారు.
ఈ సందర్భంగా సామాన్య ప్రజలకు కేంద్ర ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది. ఇప్పటికే అనేక సంక్షేమ పథకాలను తీసుకొచ్చిన మోదీ సర్కార్.. తాజాగా మరో కొత్త పథకాన్ని ప్రారంభించింది.
ఇప్పటికే కరోనా సంక్షోభం నుంచి బయటపడేందుకు “ఆత్మ నిర్బర్ భారత్” పేరుతో భారీ ఉద్దీపన పథకాన్ని ప్రకటించగా.. తాజాగా ఆత్మ నిర్బర్ హెల్త్ యోజన పథకాన్ని ప్రవేశ పెట్టారు.
ఇందుకోసం ఏకంగా రూ.64,180 కోట్లను కేటాయించారు.
ఈ నూతన పథకం ద్వారా నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ బలోపేతమౌతుందని కేంద్ర ఆర్ధికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. దేశవ్యాప్తంగా 15 హెల్త్ ఎమర్జెన్సీ సెంటర్లను
కూడా ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.ఈ ఆత్మ నిర్బర్ హెల్త్ యోజన పథకం ద్వారా సామాన్యులకు భారీగా ఊరట కలుగనుంది. కాగా, కొవిడ్ వ్యాక్సినేషన్కు కూడా ప్రత్యేకంగా
రూ.35 వేల కోట్లను కేటాయించారు.