రాష్ట్రంలోని ప్రభుత్వ మహిళా ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. విమెన్స్ డే సందర్భంగా మార్చి 8న వారికి సాధారణ సెలవు ప్రకటించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. మహిళా దినోత్సవం రోజున తెలంగాణ ప్రభుత్వం సెలవు ప్రకటించడంపై మహిళాఉద్యోగులు సంతోషం వ్యక్తం చేశారు.
అసలైతే ప్రతీ సంవత్సరం కూడా ప్రభుత్వం మార్చి8న మహిళా ఉద్యోగులకు సెలవు ఇస్తోంది.ఇక ఏడాది విమెన్స్ డే సందర్భంగా సెర్ప్, మెప్మా మహిళలకు వడ్డీ లేని రుణాలు అందజేయనున్నట్టు మంత్రి హరీశ్ రావు ప్రకటించారు. ఆరోజు 750 రూపాయల రుణాలు విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఈసారి విమెన్స్ డే రోజు హోలీ పండగ కూడా ఉండడంతో రాష్ట్రంలోని విద్యాసంస్థలకు కూడా సెలవు ప్రకటిస్తూ తెలంగాణ సర్కారు ఆదేశాలు జారీ చేసింది.