విద్యార్థుల్లో మానసిక ఒత్తిడి తొలగించటంలో యోగ ప్రముఖ పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా పరీక్షల సమయములో ధ్యానం విద్యార్థులకి మనో నిబ్బరం కలిగిస్తుంది. యోగ తో శారీరకంగా బలంగా ఉండటమే కాకుండా మానసికంగా దృఢంగా ఉంటారు. ఆరోగ్యమే మహాభాగ్యం అనే నానుడితొ పిల్లలకు మన తెలంగాణ లో యోగా నేర్పిస్తున్నారు.
రాష్ట్రంలోని కొన్ని పాఠశాలలు ఈ దిశగా ముందుకు అడుగులు వేస్తున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సోనాల లోని జిల్లా పరిషత్ పాఠశాల విద్యార్థులకు యోగ పైన అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ రాజర్షి షా మరియు ఆయుష్ విభాగం డైరెక్టర్ వాణి ప్రత్యేక చొరవతో జిల్లా వ్యాప్తంగా ఆరోగ్య పాఠశాలల్లో యోగ ఇన్స్ట్రక్టర్ ల ద్వారా శిక్షణ ఇస్తున్నారు. ఇందులో భాగంగా ప్రతి రోజు పాఠశాలల్లో యోగా శిక్షణ అందిస్తున్నారు. సోనాల పాఠశాలలో యోగ ఇన్ స్ట్రక్టర్ మునిగెల యోగిత ప్రత్యేక శ్రద్ధ తీసుకొంటూ పిల్లలకు యోగా నేర్పిస్తున్నారు.
ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు సచిన్ దేశ్ ముఖ్ మరియు ఉపాధ్యాయ బృందం తమ వంతు తోడ్పాటు అందిస్తున్నారు. పిల్లలంతా ఉత్సాహంగా యోగా నేర్చుకొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.
More Photos :