మరో అపూర్వ వేడుకకు భాగ్యనగరం వేదికకానుంది. ఈనెల 20, 21 తేదీల్లో ‘గోల్కొండ సాహితీ మహోత్సవ్’ సదస్సుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రధాన వక్తగా ఆర్ఎస్ఎస్ అఖిలభారత కార్యకారిణి సదస్యులు వడ్ల భాగయ్య హాజరుకానున్నారు. నారాయణగూడలోని`కేశవ్ మెమోరియల్ ఇన్స్టిట్యూట్ అఫ్ కామర్స్ & సైన్స్’ కేంద్రంలో ఈ సదస్సు జరగనుంది. దేశ స్వాతంత్ర్యానికి 75 ఏళ్లు పూర్తి కావస్తున్న సందర్భంగా సమాచారభారతి ఆధ్వర్యంలో ‘స్వధర్మ, స్వాభిమానం, స్వరాజ్య’ స్ఫూర్తితో నిర్వహిస్తున్నారు. వలసపాలకుల నుంచి భారతభూమి విముక్తికోసం శతాబ్దాలపాటు జరిగిన ఎన్నో పోరాటాలు, వీర నాయకుల గాధలు, వాటిని ప్రతిఫలించిన సాహిత్యం, ప్రచురణలు, జానపద సాహిత్యం-కళలపై విస్తృత చర్చలుంటాయి.
సాహితీకారులు, మేధావులు, కళాకారులు, ప్రచురణకర్తలు, యువ ఔత్సాహిక రచయితలకు వైవిధ్యభరితమైన వేదిక కల్పించి, జాతీయభావాలు, విలువలతో కూడిన చర్చలను ఈనాడు దేశంలో బలోపేతం చేయడమే `గోల్కొండ సాహిత్య మహోత్సవ్’ సదస్సు ముఖ్యోద్దేశమని నిర్వాహకులంటున్నారు.
20న వడ్ల భాగయ్య ముఖ్యవక్తగా ప్రారంభోత్సవం ఉ.10నుంచి 12.30 వరకు సర్దార్ పటేల్ హాల్, కె.ఎమ్.ఐ.టి.లో జరుగుతుంది. ‘స్వధర్మం, స్వాభిమానం, స్వరాజ్యం మూలంగా ప్రచురితమైన సాహిత్యం’ అంశంగా ప్రచురణ కర్తలు, రచయితల సమావేశం మ.2.30 నుంచి 3.30 వరకు లా కాలేజి ఆడిటోరియంలో జరుగుతుంది. స్వాతంత్ర్య సమరంలో సాహిత్యం, జానపద కళల పాత్ర- సంగోష్టి మ.4 నుంచి సాయంత్రం 5.30 వరకు లా కాలేజీ ఆడిటోరియంలో జరుగుతుంది. ‘మాతృస్తవం’ రూపకం, హైదరాబాద్ విమోచన పోరాటం నాటకం సా.5.30 నుంచి రాత్రి 7.30వరకు సర్దార్ పటేల్ హాల్లో ప్రదర్శితమవుతాయి. డా. రతన్ శార్దా, రాకా సుధాకర్ రావు ముఖ్య వక్తలుగా పుస్తకావిష్కరణ సా.5 నుంచి 6.30 వరకు సెంటర్ ఫర్ కల్చరల్ రిసోర్స్ అండ్ ట్రెయినింగ్ సెంటర్, మాదాపూర్లో జరుగుతుంది. రెండవ రోజైన 21వ తేదీన ‘స్వరాజ్య’ ఉద్యమాలు సంగోష్టి ఉ.10 నుంచి 11.15వరకు లా కాలేజి ఆడిటోరియంలో జరుగుతుంది. ‘మనం మరచిన స్వాతంత్ర్య యోధులు’- సంగోష్టి ఉ.10.30 నుంచి మ.12.45 వరకు లా కాలేజి ఆడిటోరియంలో జరుగుతుంది. యువ రచయితల సంగోష్టి మ.2.30 నుంచి సా.4 వరకు లా కాలేజి ఆడిటోరియంలో జరుగుతుంది. సునీల్ అంబేకర్ ముఖ్య వక్తగా గోల్కొండ సాహితీ మహోత్సవ్ ముగింపు కార్యక్రమం సా.4.30 నుంచి 6 వరకు సర్దార్ పటేల్ హాల్, కె.ఎమ్.ఐ.టి.లో జరుగుతుంది.
నమోదు లింక్: www.golkondalitfest.org/register/ ఫోన్: 73969 78646.