మహాత్మాగాంధీ హంతకుడు గాడ్సే బయోపిక్ తీస్తున్నారు ప్రముఖ నిర్మాత మహేశ్ మంజ్రేకర్ అన్నారు. గాంధీ జయంతి సందర్భంగా ఈ విషయాన్ని షేర్ చేస్తూ ట్వీట్ చేశారు. అంతేకాదు గాడ్సే కథ తన మనసుకు హత్తుకుందనీ ఆయన అన్నారు. లెజెండ్ గ్లోబల్ స్టూడియో, థింక్ ఇంక్ పిక్చర్స్ బ్యానర్లపై గాడ్సే తెరకెక్కుతోంది. మంజ్రేకర్ తో పాటు..గతంలో మోదీ బయోపిక్ తీసిన సందీప్ సింగ్, రాజ్ షాండిల్య నిర్మాతలు.
గాడ్సే బయోపిక్ తీయడానికి చాలా ధైర్యం కావాలి. క్లిష్టమైన, సున్నతమైన కథనాలను నేను ఇష్టపడతాను. గాడ్సే గాంధీని కాల్చి చంపాడనే విషయమే తప్ప… అతని గురించిన ఇతర వివరాలు చాలామందికి తెలియదు. ఈ సినిమాను ఎవరికీ వ్యతిరేకంగా తీయడం లేదు. తప్పొప్పులు, నిజానిజాలు ప్రేక్షకులకే వదిలేస్తామని మంజ్రేకర్ అన్నారు.
నా మొదటి సినిమా నుంచీ గాడ్సే కథ చెప్పాలనుకున్నా. గాండ్సే, గాంధీ గురించి రకరకాల కథనాలు ప్రచారంలో ఉన్నాయి. అయితే మేం వాస్తవ కథను తీసుకురావాలనుకుంటున్నాం.వాస్తవ చరిత్రను నేటి తరానికి అందించాలనే ఉద్దేశంతో సినిమా తీయాలని నిర్ణయించుకున్నామని వాళ్లంటున్నారు.
కొన్నేళ్లుగా గాడ్సేగురించి రీసెర్చ్ చేస్తున్నాం. అభిప్రాయాలు చెప్పే, భావప్రకటనా స్వేచ్ఛ ఉందని..అందుకే నాథూరామ్ గాడ్సే సినిమా తీయాలనుకుంటున్నామని మంజ్రేకర్ స్పష్టం చేశారు.
అటు గాడ్సే సినిమా తీస్తున్నానని ప్రకటించిన మంజ్రేకర్ పై ఆప్ మండిపడింది. నాథూరామ్ గాడ్సే బయోపిక్ తీయడానికి ప్రధాని మోదీ అనుమతిచ్చారా అని ఆప్ నాయకుడు సంజయ్ సింగ్ ప్రశ్నించారు. “గాంధీని చంపిన ఉగ్రవాదిని కీర్తించేందుకు మోదీ బయోపిక్ తీసిన వాళ్లే ఇప్పుడు గాడ్సే సినిమా తీస్తున్నారని …మరి మోదీజీ మీరు అనుమతి ఇచ్చారా’ అని ప్రశ్నిస్తూ ట్వీట్ చేశారు.