అలప్పుజ-కన్నూరు రైలులో అగ్నిప్రమాదం-ఉగ్రకుట్రపై అనుమానాలు-ఎన్ఐఎ దర్యాప్తు
కేరళ అలప్పుజ-కన్నూరు ఎగ్జిక్యూటివ్ ఎక్స్ ప్రెస్ రైలులో గుర్తు తెలియని వ్యక్తి తోటి ప్రయాణికుడిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. దీంతో మంటలు ఎగిసిపడి ఎనిమిది మందికి కాలిన గాయాలయ్యాయి.
రైలు కోజికోడ్ నగరం దాటిన తర్వాత…కొరపుజా రైల్వే వంతెన వద్దకు చేరుకున్న సమయంలో ఈ దారుణం జరిగింది. దాడి చేసిన వెంటనే ఆ వ్యక్తి అక్కడ్నుంచి పారిపోయాడు. ఇతర ప్రయాణికులు ఎమర్జెన్సీ చైన్ లాగి … క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. రైలు కన్నూర్ చేరుకునేసరికి ఓ మహిళ, చిన్నారి కనిపించడం లేదని ఓ ప్రయాణికుడు ఫిర్యాదు చేశాడు.
తాను గాయపడ్డానని, తోటి ప్రయాణికురాలు, ఓ చిన్న పిల్ల లేరని.. వెతికితే ఆమె బూట్లు, మొబైల్ మాత్రం దొరికాయని అతను మీడియాకుసైతం తెలిపాడు. అతని ఫిర్యాదు ఆధారంగా వెదికితే… ట్రాక్ల పక్కన ఒక మహిళ, ఒక చిన్నారి మరియు ఒక మధ్య వయస్కుడైన వ్యక్తి మృతదేహాలను దొరికాయి.
మంటలు వ్యాపించగానే వారు ట్రైన్ నుంచి దూకి ఉండవచ్చునని భావిస్తున్నారు. అయితే మహిళ, చిన్నారితో పాటు చనిపోయిన మూడో వ్యక్తిని డిల్లీ నోయిడాకు చెందిన షారూఖ్ సైఫీ గా గుర్తించారు. ఈ ఘటన వెనక ఉగ్రకుట్ర ఏమైనా ఉండవచ్చనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. రెండు రోజుల క్రితంకేరళ చేరుకున్న
NIA టీం దర్యాప్తు చేస్తోంది.