గోదావరి నదికి పుష్కరాలు రాబోతున్నాయి. గలగల పారే గోదావరి ఇప్పటినుంచి పుష్కర శోభను సంతరించుకోబోతుంది. పుష్కరాల సమయానికి గోదావరి అటూ ఇటూ ఉన్న పట్టణాలను ,, అద్భుతంగా తీర్చిదిద్దేందుకు సన్నాహాలు మొదలుపెట్టారు. రాబోయే పుష్కరాలను అద్భుతంగా నిర్వహించేందుకు ప్రణాళికను సిద్ధం చేశారు.
………
ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం జనసేన బిజెపి కూటమి ప్రభుత్వం ఏర్పడినాక,, అన్ని పనులు ప్రణాళిక బద్ధంగా చేస్తున్నారు. రెండేళ్లలో వచ్చే గోదావరి పుష్కరాల కోసం ఇప్పుడే అన్ని హంగులను తీర్చిదిద్దుతున్నారు.
వేదంలా ఘోషించే అఖండ గోదారమ్మ ప్రాజెక్టుకు కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ శంకుస్థాపన చేశారు. ఇందులో ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బిజెపి రాష్ట్ర అధ్యక్షులు రాష్ట్ర టూరిజం మంత్రి కందులు దుర్గేష్ సహా కూటమిక సంబంధించిన అనేకమంది నాయకులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం భారీ సాయం చేయడంతో అఖండ గోదావరి ప్రాజెక్టు పట్టాలెక్కనుంది. 127 సంవత్సరాల అతి పురాతన హావలాక్ వంతెనతోపాటు, 121 ఎకరాల లంక భూములను ఉపయోగించుకుంటూ నదీ తీరంలో ఆధ్యాత్మికత ఉట్టిపడేలా అభివృద్ధి చేపట్టనున్నారు. ఈ ప్రాజెక్టు రెండేళ్లలో అందుబాటులోకి రానుంది.
………
ఒకరకంగా చెప్పాలి అంటే వచ్చే పుష్కరాలు నాటికి ఈ ప్రాంతం సర్వాంగ సుందరంగా మారిపోబోతోంది. అఖండ గోదావరి ప్రాజెక్టు నది సహజ అందాలను, చారిత్రాత్మక హావలాక్ వంతెన, ఆధ్యాత్మిక కేంద్రాలను, స్థానిక సంస్కృతిని ప్రపంచానికి పరిచయం చేయడానికి ఉద్దేశించింది ఈ ప్రాజెక్టు. రాజమహేంద్రవరం, కడియం, కొవ్వూరు, నిడదవోలు ప్రాంతాలను పర్యాటకంగా అభివృద్ధి చేయనున్నారు. ఇందుకు కేంద్రం రూ.94 కోట్లు విడుదల చేసింది. కొంత మొత్తం రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేయనుంది. ఇంతకు సంబంధించిన సమగ్ర ప్రణాళిక ఇప్పటికే రెడీ అయినట్లు సమాచారం.
……..
అఖండ గోదావరి ప్రాజెక్టులో అనేక విశేషాలున్నాయి. 127 సంవత్సరాలనాటి హావలాక్ వంతెనకు కొత్త రూపు ఇవ్వనున్నారు. వంతెన సుందరీకరణ చేయనున్నారు. రాత్రి వేళల్లో లైటింగ్ వ్యవస్థ ఉపయోగపడనుంది. వాక్ వేలు, వీక్షణ స్థలాలను అభివృద్ధి పరచి పర్యాటకులను ఆకర్షిస్తారు. పుష్కర్ ఘాట్ను రూ.12 కోట్లతో అభివృద్ధి పరుస్తారు. స్నానఘట్టాలను మెరుగు పరుస్తారు. మౌలిక సదుపాయాలు కల్పిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు అనువైన వాతావరణం సృష్టించనున్నారు. గోదావరి మధ్యలోని 121 ఎకరాల లంక భూముల్లో సుందరీకరణ పనులు చేపట్టనున్నారు. పర్యాటకులు విశ్రాంతి తీసుకునేందుకు గదులు, ఫుడ్ కోర్టులు అందుబాటులోకి తేనున్నారు. కడియం నర్సరీ దేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందింది. దీనికి మరింత పర్యాటక శోభను తీసుకురానున్నారు. నర్సీరీల్లో గైడెడ్ టూర్స్, బొటానికల్ గార్డెన్స్, పుష్ప ప్రదర్శనలు ఏర్పాటు చేయనున్నారు. కొవ్వూరు గోపాద క్షేత్రం ఎంతో విశిష్టత కలిగి ఉంది. ఆధ్యాత్మిక, పర్యాటకంగా అభివృద్ధి చేయనున్నారు. నిడదవోలు కోట సత్తెమ్మ ఆలయం పర్యాటకంగా ఎంతో ముఖ్యమైన ప్రదేశం. ఆలయం చుట్టూ సౌకర్యాలు మెరుగుపరుస్తారు. సందర్శకులకు ఆధ్వాత్మిక అనుభవం కలిగేలా పనులు చేపట్టనున్నారు.
……..
అఖండ గోదావరి ప్రాజెక్టు పనులు 2027లో జరగనున్న పుష్కరాల నాటికి పూర్తి చేయనున్నారు. గోదావరి పుష్కరాలకు రాజమహేంద్రవరం సమీప ప్రాంతాల్లోనే 30 లక్షల మంది పుణ్యస్నానాలు ఆచరిస్తారని అంచనా.
ఈ పర్యాటకులు చుట్టుపక్కల ప్రాంతాలలో పర్యటించి చక్కటి అనుభూతి పొందేట ప్రణాళికలు రూపొందించారు.