జ్ఞానవాపి మసీద్ కేసులో విచారణ గురువారానికి వాయిదా పడింది. ఈ నెల 26వ తేదీన విచారణ చేపట్టనున్నట్టు వారణాసి జిల్లా కోర్టు స్పష్టం చేసింది. సర్వే నివేదికలో ఏవైనా అభ్యంతరాలుంటే వారం రోజుల్లోగా తెలపాలని హిందూ, ముస్లిం పక్షాలను ఆదేశించింది. జ్ఞానవాపి కేసును కొట్టివేయాలంటూ ముస్లిం పక్షం కోరుతుండగా..శివలింగం ఉన్న ప్రాంతంలో పూజలకు అనుమతించాలని హిందువులు కోరుతున్నారు.