రాష్ట్రీయ సంస్కృతీ మహోత్సవ్ హైదరాబాద్ లో ఘనంగామొదలైంది. కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖామంత్రి కిషన్ రెడ్డి, గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఉదయం 10 గంటలకు క్రాఫ్ట్, ఫుడ్ ఎగ్జిబిషన్ను ప్రారంభించారు.
మినిస్ట్రీ అఫ్ కల్చర్ ఆధ్వర్యంలో ఏప్రిల్ 1 – 3 వరకు ఎన్టీఆర్ స్టేడియంలో మూడు రోజులు ఈ మేళ నిర్వహిస్తున్నారు. సాధారణ ప్రజలకు కూడా ఈవెంట్కి ప్రవేశం ఉచితం. ఈరోజు సాయంత్రం 5.30 గంటలకు ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. వివిధ రాష్ట్రాలకు చెందిన స్టాల్స్ ఏర్పాటు చేశారు.
తెలుగు సంవత్సరాది ఉగాది పండుగ సంబరాలను పురస్కరించుకుని దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి 1,000 మంది కళాకారులు సాంప్రదాయ, జానపద సహా ప్రసిద్ధ సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించే ప్రదర్శనలు ఆకట్టుకోనున్నాయి.
ఇందులో ఆనంద శంకర్ జయంత్ తోపాటు శాస్త్రీయ సంగీతం, నృత్య విద్వాంసుల ప్రత్యక్ష ప్రదర్శనలు ఉంటాయి. ప్రముఖ త్రయం శంకర్ మహదేవన్-ఎహసాన్-లాయ్ చేత మ్యూజికల్ నైట్, బన్యన్ ట్రీ చేత “తాల్ ఇండియా” శాస్త్రీయ సంగీత ప్రదర్శన, ఆ తర్వాత ప్రముఖ సినీ సంగీత దర్శకుడు ఎస్.ఎస్.థమన్ మరో మ్యూజికల్ నైట్, జయప్రభ మీనన్ శాస్త్రీయ నృత్యం, మూడు రోజుల పాటు ప్రముఖ ద్వయం ఎల్.సుబ్రమణ్యం, కవితా కృష్ణమూర్తి సంగీత కచ్చేరీలు ఉండనున్నాయి.
మార్చి 26,27 తేదీల్లో ఏపీలోని రాజమహేంద్రవరంలో, మార్చి 29,30 రోజుల్లో వరకు తెలంగాణలోని వరంగల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
(మైఇండ్ మీడియా ఫేస్బుక్, ట్విటర్, ఇన్స్టాగ్రామ్ను ఫాలో అవ్వండి. యూట్యూబ్ చానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.)