రాష్ట్రానికి భారీ పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా విశాఖలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ జరిగింది. సమ్మిట్ కు దేశ, విదేశాల నుంచి పారిశ్రామికవేత్తలు హాజరయ్యారు. రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ, సంజీవ్ బజాజ్, జీఎం రావు, సజ్జన్ జిందాల్ వంటి ప్రముఖులు తరలివచ్చారు.ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో వరుసగా మూడుసార్లు మొదటిస్థానం ఏపీదే నని ఈ సందర్భంగా జగన్ గుర్తు చేశారు. దాదాపు 13 లక్షల కోట్లమేర పెట్టుబడులు పెట్టేందుకు 340 సంస్థలు ముందుకు వచ్చాయి. తొలిరోజు 92 ఎంవోయూలు చేసుకున్నారు. 6 లక్షలమందికి ఉపాధి అవకాశాలు దక్కనున్నాయి. రెండురోజుల సమ్మిట్ రేపటితో ముగియనుంది. ఇక విశాఖే పరిపాలనా రాజధానిగా ఉంటుందని..త్వరలోనే తాను విశాఖ షిఫ్ట్ అవుతానని జగన్ మరోసారి స్పష్టం చేశారు.
https://twitter.com/AndhraPradeshCM/status/1631638269653061635?s=20
https://twitter.com/AndhraPradeshCM/status/1631637907026096128?s=20