విశాఖ వేదిగ్గా ప్రారంభమైన గ్లోబెల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ఇవాళ ముగిసింది. ప్రముఖ పారిశ్రామికవేత్తలు ఈ సమ్మిట్ కు హాజరయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలు, పరిస్థితులు, వనరుల గురించి ముఖ్యమంత్రి జగన్ వారికి వివరించారు. రాష్ట్రంలో ఇన్వెస్ట్ చేసేందుకు ముందుకు వచ్చిన అందరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు. సదస్సు విజయవంతం అయిందన్న ఆయన…15 రంగాల్లో పెట్టుబడులకు పారిశ్రామికవేత్తలు ముందుకు వచ్చారని ఆయన వివరించారు. రెండు రోజుల సదస్సులో 352 ఎంవోయూలు జరిగాయని 13 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని అన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఏపీ మొదటి స్థానంలో ఉందని జగన్ అన్నారు.