హిందూత్వానికి జై కొడుతున్న ప్రపంచం
క్రైస్తవులు, ముస్లింల తర్వాత ప్రపంచంలో హిందువుల సంఖ్యే ఎక్కువ. హిందవుల మొత్తం జనాభా సుమారు 120 కోట్లు. అంటే ప్రపంచంలోని మొత్తం జనాభాలో దాదాపు 15 శాతం. భారత్, నేపాల్ తో పాటు మారిషస్ లో హిందువులు మెజారిటీగా ఉన్నారు. భారత్ లో 80 శాతం, నేపాల్ లో 81.3 శాతం, మారిషస్ లో 51 శాతం మంది హిందువులే.
చాలా దేశాల్లో, ముఖ్యంగా ఐరోపా ఖండంలో హిందూత్వంపై ఆసక్తి పెరుగుతున్నది. చాలా మంది ప్రముఖులు, సెలబ్రిటీలు, పారిశ్రామిక వేత్తలు హిందూత్వం ఆచరిస్తున్నారు. కొందరు హిందుత్వం స్వీకరించారు. మరికొందరు మతం మారకపోయినా హిందువులుగానే జీవిస్తున్నారు. ఫోర్డ్ కంపెనీ వ్యవస్థాపక కుటుంబ వారసుడు అల్ ఫ్రెడ్ ఫోర్డ్ తన పేరును అంబరీష్ దాస్ గా మార్చుకున్నారు. ప్రఖ్యాత హాలీవుడ్ నటి జూలియా రాబర్ట్స్ హిందూత్వం ఆచరిస్తున్నారు. ఇంకా వందల మంది ప్రముఖులు హిందూత్వం స్వీకరించారు. ఐరోపా ఖండానికి చెందిన ఎంత మంది క్రైస్తవ ప్రముఖులు గత కొన్ని సంవత్సరాలలో హిందూత్వం స్వీకరించారు.
శాంతి, పరమత సహనం, లోక కల్యాణం కోరుకోవడం హిందూత్వంలోని గొప్పతనం. కొన్ని ఇతర మతాల్లో బోధనలు ఇందుకు విరుద్ధంగా ఉంటాయి. ఆ మతాన్ని ఆచరించని వారు పాపులని, వారిని శిక్షించాలని, వాళ్ల మత చిహ్నాలను ధ్వంసం చేయాలని బోధించే మతాలు కొన్ని ఉన్నాయి. హైందవం అలా కాదు. వసుధైవ కుటుంబకం అని బోధస్తుంది. అంటే ప్రపంచం మొత్తం ఒకే కుటుంబం లాంటిదని అర్థం. సర్వేజనాః సుఖినోభవంతు అని బోధించేది హిందూత్వం. అంతేగానీ కేవలం హిందువులు మాత్రమే సుఖినోభవంతు అని హైందవం చెప్పదు. హిందువు సహజంగానే సెక్యులర్. ప్రపంచానికి హిందూత్వమే శ్రీరామ రక్ష అని భావించే వారి సంఖ్య వేగంగా పెరుగుతున్నది. సంస్కృతానికి, భగవద్గీత గ్రంథానికి కూడా ఐరోపాలో క్రేజ్ పెరుగుతున్నది. భారతదేశంలో మాత్రం హిందూ కుటుంబాల్లో పుట్టిన కొందరు, అసంబద్ధమైన భావజాలం పేరుతో, ఫాల్స్ ప్రెస్టిజ్ తో హిందూత్వంలోని గొప్పతనాన్ని విస్మరిస్తున్నారు. అందుకే బాల్యం నుంచే హిందువులకు ఈ వాస్తవాలు చెప్పడ చాలా చాలా అవసరం.