
Supreme Court of India
మత మార్పిడి నిరోధానికి వివిధ రాష్ట్రాలు తెచ్చిన చట్టాలను సవాల్ చేస్తూ హైకోర్టుల్లో దాఖలైన కేసులస్థితిని తెలియజేయాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ తో పాటు సిటిజన్స్ ఫర్ జస్టిస్ అండ్ పీస్ స్వచ్ఛందసంస్థకు ఈ మేరకు కోర్టు సూచనలు చేసింది. రాష్ట్రాలు తీసుకొచ్చిన చట్టాలు, ఆర్డినెన్సులు లేదా చట్టసవరణలకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లు ఏమైనా ఉంటే అన్నీ కలిపి నోట్ చేయాలని… అన్నీ ఒకేతరహా కేసులైతే మాత్రం సుప్రీం కోర్టుకు బదిలీ చేసేలా ఆదేశాలిస్తామని జస్టిస్ చంద్రచూడ్, జస్టిస్ పీఎస్ నరసింహారావుతో కూడిన ధర్మాసనం తెలిపింది.
గుజరాత్ ప్రభుత్వం తీసుకొచ్చిన “తస్వేచ్ఛ చట్టం -2003” లోని సెక్షన్ 5 అమలు నిలిపివేతకు హైకోర్ట్ ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ దాఖలైన వివరాలు అందజేయాలని సుప్రీం కోర్ట్ రిజిస్ట్రీనీ ధర్మాసనం ఆదేశించింది. ఈ అంశంపై పలురాష్ట్రాల్లో దాఖలైన ఆయా పిటిషన్లు అన్నింటిని సుప్రీంకోర్టుకు బదిలీ చేయడమే సముచితం అని సీనియర్ న్యాయవాది ఇందిరా జైసింగ్ అభిప్రాయపడ్డారు.