రాష్ట్రీయ వానరసేన తెలంగాణ రాష్ట్ర కార్య నిర్వాహక అధ్యక్షులుగా గిరీశ్ దారమోని నియమితులయ్యారు. సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు రాంరెడ్డి గిరీశ్ నియామకాన్ని ప్రకటించి ఆయన్ని అభినందించారు.
రాష్ట్రవ్యాప్తంగా కబ్జా అయిన ఆలయాల భూములను కాపాడాలంటూ ఫిర్యాదులను దేవాదాయ కమిషనర్ అనిల్ కుమార్ నుకలిసి విజ్ఞప్తి చేశారు వానరసేన ప్రతినిధులు. కబ్జాకు సంబంధించి ఆధారాలతో 9 ఫిర్యాదులు చేసినట్టు వానరసేన చీఫ్ రాంరెడ్డి తెలిపారు.