
File Photo
దాదాపు 50ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీలో ఉంటూ వివిధ పదవుల్లో పనిచేసిన గులాంనబీ ఆజాద్ ఆ పార్టీని వీడారు. రాహుల్ గాంధీ తీరు నచ్చకనే పార్టీని వీడుతున్నట్టు ప్రకటించారు. ఈమేరకు పార్టీ చీఫ్ సోనియాకు లేఖ రాశారు ఆజాద్. ఆయన తీరువల్లే పార్టీ పతనావస్థలోకి వెళ్లిందని ఆరోపించారు. 2013లో పార్టీ పగ్గాలు చేపట్టిందిమొదలు ఓ పద్ధతంటూ లేకుండా పార్టీని నడిపారని మండిపడ్డారు. సీనియర్లను కాదని..పీఏలు, సెక్యూరిటీ, తన సొంత కోటరీ మనుషులకే ప్రాధాన్యత ఇచ్చారనీ లేఖలో పేర్కొన్నారు. 2014లో పార్టీ ఓటమి కారణం…క్రమంగా నేటి ఈ స్థితికి కాంగ్రెస్ చేరుకోవడానికి కారణం రాహుల్ తీరుమాత్రమేనన్నారు. రాహుల్ గాంధీది అపరిపక్వ మనస్తత్వమని ఆ తీరు వల్లే పార్టీ హీన స్థితికి దిగజారిందని పోతూపోతూ తీవ్ర విమర్శలే చేశారు ఆజాద్. అయితే కాంగ్రెస్ ను వీడిన ఆజాద్ ఏ పార్టీలో చేరతారన్నది తెలియడం లేదు. కొద్దిరోజుల్లో ఆయన కొత్తపార్టీ పెడతారని ప్రచారం జరుగుతోంది.
https://twitter.com/ANI/status/1563045488567263232?s=20&t=f8nqUD_uSnUoBTq2ShL9pw