గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికల నగారా మోగింది. ఎన్నికల కమిషనర్ పార్థసారధి షెడ్యూల్ను విడుదల చేశారు. బల్దియా ఎన్నికలకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. నవంబర్ 18 నుంచే జీహెచ్ఎంసీ నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతాయి. డిసెంబర్ 1న గ్రేటర్ ఎన్నికల పోలింగ్ జరుగుతుంది. 4న ఓట్ల లెక్కింపు.. అదే రోజు ఫలితాలు వెల్లడి అవుతాయి. అసరమైతే డిసెంబర్ 3న రీపోలింగ్ నిర్వహించనున్నట్లు ఎన్నికల కమిషనర్ తెలిపారు.
ఈ నెల 20వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. 21న నామినేషన్ల పరిశీలన, 22న ఉప సంహరణ కార్యక్రమం ఉంటుంది. చట్ట ప్రకారమే ఎన్నికల నిర్వహణ జరుగుతుందని పార్థసారధి వెల్లడించారు. ఇప్పటికే ఎన్నికల కసరత్తు పూర్తి చేసినట్లు చెప్పారు. డిసెంబర్ 6 లోగా ఎన్నికల ప్రక్రియ పూర్తి చేస్తామని అన్నారు. మొత్తం 14 రోజుల్లో ఎన్నికల ప్రక్రియ ముగుస్తుందని చెప్పారు. బ్యాలెట్ పద్ధతిలోనే జీహెచ్ఎంసీ ఎన్నికలు జరుగుతాయని పార్థసారథి పేర్కొన్నారు. జీహెచ్ఎంసీ చట్ట ప్రకారమే 150 వార్డులకు ఎన్నికలు నిర్వహిస్తామని అన్నారు.
ఇక పోలింగ్కు సంబంధించి 55వేల మంది సిబ్బందిని అందుబాటులో ఉంచామన్నారు. బ్యాలెట్ పేపర్ తెలుపు రంగులో ఉంటుందని తెలిపారు. గ్రేటర్లో 257 క్రిటికల్, 1,004 అత్యంత సమస్యాత్మక, 1439 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు గుర్తించామని వెల్లడించారు. గతంతో పోలిస్తే ఈసారి ఎక్కువ పోలింగ్ నమోదయ్యేలా ప్రజలకు అవగాహన కల్పిస్తాని చెప్పారు. జీహెచ్ఎంసీ పరిధిలో 2009లో 42.04 శాతం, 2016లో 45.29శాతం పోలింగ్ నమోదైందని పేర్కొన్నారు.
నామినేషన్స్ టర్మ్ పూర్తయ్యే లోపు ఎలక్షన్స్ నిర్వహించాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు పార్థసారథి. 2016 రిజర్వేషన్ల ప్రకారమే ఎలక్షన్స్ జరుగుతున్నాయన్నారు. 150 వార్డులకు 150 కౌంటిగ్ సెంటర్లు ఉంటాయన్నారు. బ్యాలెట్ బాక్స్ ద్వారా ఎలక్షన్స్ జరుగుతాయన్నారు. 2016 జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అమలైన రిజర్వేషన్లే ఇప్పుడూ కొనసాగిస్తామని పార్థసారథి పేర్కొన్నారు. అసెంబ్లీ ఓటర్ల జాబితా ఆధారంగానే గ్రేటర్ ఎన్నికలు నిర్వహిస్తామని వెల్లడించారు. జనవరి 1, 2020 నాటికి 18 ఏళ్లు పూర్తి చేసుకున్న వయోజనులు ఓటు వేసేందుకు అర్హులని తెలిపారు. బల్దియా పరిధిలో 52.09 శాతం పురుషులు, 47.90 శాతం మహిళా ఓటర్లున్నారని తెలిపారు. జీహెచ్ఎంసీ పరిధిలో 74 లక్షల 4 వేల మందికి పైగా ఓటర్లున్నారని వెల్లడించారు. అత్యధికంగా మైలార్దేవ్పల్లిలో 79,290 మంది ఓటర్లు ఉండగా.. అత్యల్పంగా రామచంద్రాపురంలో 27,997 మంది ఓటర్లున్నారని ఎస్ఈసీ వివరించారు.
తాము అన్ని రాజకీయ పక్షాలతో చర్చించి ఓటర్ల జాబితాపై తుదినిర్ణయం తీసుకున్నామని పార్థసారధి వెల్లడించారు. పోలీసు బందోబస్తు విషయంపై డీజీపీ, సీపీలతో ఇప్పటికే చర్చించామని పేర్కొన్నారు. ఈవీఎంలపై అభ్యంతరాలు రావడంతోనే బ్యాలెట్ పద్ధతిలోనే జీహెచ్ఎంసీ ఎన్నికలు నిర్వహించాల్సి వస్తుందని ఎస్ఈసీ స్పష్టం చేశారు. జీహెచ్ఎంసీ పరిధిలో తక్షణమే ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుందని తెలిపారు. నామినేషన్స్ టర్మ్ పూర్తయ్యే లోపు ఎలక్షన్స్ నిర్వహించాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు పార్థసారథి. 2016 రిజర్వేషన్ల ప్రకారమే ఎలక్షన్స్ జరుగుతున్నాయన్నారు. 150 వార్డులకు 150 కౌంటిగ్ సెంటర్లు ఉంటాయన్నారు. బ్యాలెట్ బాక్స్ ద్వారా ఎలక్షన్స్ జరుగుతాయన్నారు.
గ్రేటర్ లో మొత్తం 74 లక్షల 4 వేల 286 ఓటర్లు ఉన్నారన్నారు . అందులో పురుషులు 38 లక్షల 56 వేల 770 , మహిళలలు 35 లక్షల 46 వేల 847, ఇతరులు 669, పోలింగ్ కేంద్రాలు 9248 ,గ్రేటర్ లో 150 వార్డులు , గ్రేటర్ లో అతి పెద్ద డివిజన్ మైలార్ దేవ్ పల్లిలో 79 వేల 290 మంది ఓటర్లు ఉన్నారు. అతి చిన్న డివిజన్ అయిన రామచంద్రాపురంలో 27 వేల 948 మంది ఓటర్లు ఉన్నారు.
రిజర్వేషన్ల వివరాలు ఇలా ఉన్నాయి.. జీహెచ్ఎంసీ మేయర్ పదవి మహిళ (జనరల్), ఎస్టీ 2, ఎస్సీ 10, బీసీ 50, జనరల్ మహిళ 44, జనరల్ 44 స్థానాలు. జీహెచ్ఎంసీ జనరల్ అభ్యర్థులకు నామినేషన్ డిపాజిట్ రూ.5 వేలు, ఎస్సీ,ఎస్టీ ,బీసీ మైనార్టీలకు రూ.2500 నామినేషన్ డిపాజిట్ . డివిజన్ అభ్యర్థి ఖర్చు రూ. 5 లక్షలుగా నిర్ణయించారు. ఫలితాలు వచ్చాక 45 రోజుల్లో ఎన్నికల ఖర్చులు చూపాల్సి ఉంటుంది. ఎన్నికలకు సంబంధించిన ఖర్చులు చూపని అభ్యర్థులపై 3 ఏళ్ల పాటు అనర్హత వేటు వేయనున్నారు.
వివరాలు క్లుప్తంగా..
నవంబర్ 18 ,19, 20న నామినేషన్స్ స్వీకరణ
21 పరిశీలన, 22న నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం, అదే రోజు అభ్యర్థుల ఫైనల్.
డిసెంబర్ 1న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్
మధ్యాహ్నం 12 గంటలకల్లా బ్యాలెట్ పేపర్లు సెపరేటు
మధ్యాహ్నం 3 గంటలకల్లా ఫలితాలు
ఎస్సీ, బీసీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.2500 నామినేషన్ డిపాజిట్
రిటర్నింగ్ అధికారి దగ్గరకు వచ్చే నామినేషన్లు దాఖలు చేయాలి
ప్రస్తుతం 9,238 పోలింగ్ కేంద్రాలు
తెలుగు రంగు బ్యాలెట్ పేపర్ వినియోగం
కొన్ని పోలింగ్ కేంద్రాల్లో ఫేస్ రికగ్నేషన్ తో ఓటర్లను గుర్తింపు ప్రక్రియ చేపట్టనున్న ఈసీ
గ్రేటర్ హైదరాబాద్ మేయర్ పదవి జనరల్ మహిళకు రిజర్వ్
డిసెంబరు 3న అవసరమైన కేంద్రాల్లో రీ పోలింగ్
డిసెంబర్ 4 న ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడి