తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ ను నియమించారు కేసీఆర్. ఈమేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్కు గెల్లు శ్రీనివాస్ యాదవ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఉస్మానియా విద్యార్థి నాయకుడిగా తెలంగాణ ఉద్యమంలో గెల్లు చురుగ్గా పాల్గొన్నారు. తెలంగాణ ఏర్పడిన తరువాత ఆయన్ని పార్టీ యువజన విభాగం టీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షునిగా నియమించారు. ఈటల రాజేందర్ రాజీనామా తరువాత జరిగిన హుజూరాబాద్ ఉపఎన్నికల్లో గెల్లు శ్రీనివాస్ బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. అయితే వచ్చే ఎన్నికల్లో హుజారాబాద్ నుంచి పాడి కౌశిక్ రెడ్డికి పార్టీ టికెట్ ఇవ్వవచ్చని ప్రచారం జరుగుతోంది. ఈనేపథ్యంలోనే గెల్లును ఈ పదవికి ఎంపిక చేసింది పార్టీ.