ఎన్నికల షెడ్యూల్ కూడా విడుదల కావడంతో హుజూరాబాద్ లో రాజకీయం మరింత వేడెక్కింది. టీఆర్ఎస్ అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్ యాదవ్ నామినేషన్ వేశారు. మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామాతో అక్కడ ఎన్నిక అనివార్యమైంది. ఈటల బీజేపీ అభ్యర్థిగా బరిలో నిలవనున్నారు. ఆయన ఎప్పుడు నామినేషన్ వేసేదీ నిర్ణయించలేదు. ఇక కాంగ్రెస్ పార్టీ ఇంకా అభ్యర్థిని ప్రకటించలేదు. హుజూరాబాద్ లో ప్రధానంగా టీఆర్ఎస్, బీజేపీ మధ్యే పోటీ ఉండనుంది.