అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ 115.5 బిలియన్ డాలర్ల సంపదతో మైక్రోసాఫ్ట్ కో-ఫౌండర్ బిల్ గేట్స్ను అధిగమించి ప్రపంచంలోని నాల్గవ సంపన్నుడిగా నిలిచారు. ఫోర్బ్స్ కు సంబందించిన రియల్ టైమ్ బిలియనీర్ల జాబితా ప్రకారం $104.6 బిలియన్ల నికర సంపద కలిగిన గేట్స్ను భారతీయ వ్యాపారవేత్త వెనక్కినెట్టారు. తన ఆస్తిలో నుంచి 20 బిలియన్ డాలర్లను విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించిన తర్వాత బిల్ గేట్స్ ర్యాంకింగ్స్లో పడిపోయారు.
అమెజాన్కు చెందిన జెఫ్ బెజోస్, బెర్నార్డ్ ఆర్నాల్ట్ & లూయిస్ విట్టన్ కుటుంబం సహా 235.8 బిలియన్ల నికర సంపదతో ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడిగా ర్యాంకింగ్స్లో అగ్రస్థానంలో ఉన్న ఎలోన్ మస్క్ల తర్వాత నాలుగో స్థానంలో గేట్స్ ఇది వరకు ఉన్నారు.
గాడోట్ భాగస్వామ్యంతో ఇజ్రాయెల్లోని ఓడరేవును ప్రైవేటీకరించడానికి టెండర్ను తన గ్రూప్ గెలుచుకున్నట్లు అదానీ ప్రకటించిన కొన్ని రోజుల తర్వాత ఈ పరిణామం జరిగింది. ఇదిలా ఉండగా, జూలై 26న 5G స్పెక్ట్రమ్ వేలంలో పాల్గొనేందుకు అదానీ ఎంటర్ప్రైజ్ లిమిటెడ్ కూడా దరఖాస్తు చేసుకుందని డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్(DoT) తెలిపింది. ఇదే సంవత్సరం మే నెలలో భారతదేశంలో స్విస్ దిగ్గజం హోల్సిమ్ సిమెంట్ వ్యాపారాన్ని $10.5 బిలియన్లకు కొనుగోలు చేసి గౌతమ్ అదానీ సిమెంట్ వ్యాపారంలోకి ఘనంగా అడుగుపెట్టారు.