ప్రఖ్యాత టైమ్ మ్యాగజైన్ ‘ప్రపంచంలో అత్యంత ప్రభావశీల వ్యక్తుల మొదటి100 మంది’ జాబితాలో భారత్ నుంచి
ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ, అడ్వొకేట్ కరుణా నందికి చోటుదక్కింది. పెద్దగా ప్రజల్లో ఉండకుండానే..నిశ్శబ్దంగా తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటూ వెళ్తున్న పారిశ్రామిక వేత్త గౌతమ్ అదానీ అంటూ టైమ్స్ కొనియాడింది. ఇక మహిళల హక్కుల కోసం పోరాడుతున్న అడ్వొకేట్ కరుణానంది. వీరితో పాటు భారత్ కు చెందిన మరో వ్యక్తి ఖుర్రం పర్వేజ్ కు కూడా ఈ జాబితాలో చోటు దక్కింది.
2022 సంవత్సరానికి గానూ విడుదలచేసిన జాబితాలో అమెరికా అధ్యక్షుడు బైడెన్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ, రష్యా అధినేత పుతిన్, చైనా అధినేత జిన్పింగ్, యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా, టెన్నిస్ క్రీడాకారుడు రఫేల్ నాదల్, ఆపిల్ సీఈఓ టిమ్ కుక్, ప్రముఖ వ్యాఖ్యాత ఓప్రా విన్ఫ్రే వంటి వాళ్లున్నారు.