ఇండోనేసియాలో ఎగురుతున్న గరుడ!
ప్రపంచంలో అతి ఎక్కువ మంది ముస్లింలు నివసించే దేశం ఇండోనేసియా. ఆ దేశ జనాభా దాదాపు 27 కోట్లు. ఇందులో 87 శాతం మంది ముస్లింలు. కేవలం 1.7 శాతం మంది మాత్రమే హిందువులు. ఒకప్పుడు ఇది హిందూ దేశమే. జావా, బాలి వంటి ద్వీపాల్లో ఇప్పటికీ హిందూత్వ ఆనవాళ్లు, ఆలయాలు కనిపిస్తాయి.
ప్రపంచంలో ఆరో అతిపెద్ద హిందూ దేవాలయం బెసాకిన్ ఆలయం ఇడోనేసియా లోని బాలి ద్వీపంలో ఉంది. అలాగే తొమ్మిదో అతిపెద్ద 9. ప్రాంబనం త్రిమూర్తి ఆలయం యోగ్యాకార్తా, ఇండోనేసియాలోనే ఉంది. ఇండోనేసియాలో దాదాపు ప్రతి ఒక్కరికీ రామాయణం, మహాభారతం తెలుసు.
ఆ దేశంలోని ప్రభుత్వరంగ విమానయాన సంస్థ పేరు గరుడ. అవును. రామాయణంలోని గరుడ పక్షి పేరునే వాళ్లు తమ ఎయిర్ లైన్స్ కంపెనీకి పెట్టారు. గరుడ ఇంటర్నేషనల్ ఎయిర్ లైన్స్ విమానాలు ప్రపంచంలోని చాలా దేశాల్లో విహరిస్తుంటాయి. భారతదేశంలోని ప్రభుత్వరంగ విమానయాన సంస్థ పేరు ఇండియన్ ఎయిర్ లైన్స్. ఇండోనేసియాను చూసిన తర్వాతైనా దీని పేరు గరుడ అనో లేక పుష్పక్ అనే మార్చాలని కొందరు కోరుతున్నారు. ఆ సంగతి ఎలా ఉన్నా ఇండోనేసియాలో ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలు చాలా వరకు రామాయణ నృత్య రూపకంతో మొదలవుతాయి.