మొహాలీ హెడ్ క్వార్టర్స్ పై RPG దాడిలో కెనడాకు చెందిన గ్యాంగ్ స్టర్ లఖ్బీర్ సింగ్ అలియాస్ లిండాను సూత్రధారిగా తేల్చారు పంజాబ్ పోలీసులు. లఖ్బీర్ సోమవారం సాయంత్రం మొహాలీలోని పంజాబ్ పోలీస్ ఇంటెలిజెన్స్ హెడ్క్వార్టర్స్పై జరిగిన ఉగ్రదాడికి కావాల్సిన RPG, AK-47 తోపాటు స్థానిక నేరస్తులను కూడా అందించినట్టు నిర్దారించారు.
టార్న్ తరణ్కు చెందిన లఖ్బీర్(33), 2017లో కెనడాకు పారిపోయి పాకిస్థాన్కు చెందిన వాంటెడ్ గ్యాంగ్స్టర్ హర్విందర్ సింగ్ అలియాస్ రిండాకు సన్నిహితుడయ్యాడు, అలాగే బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్ (BKI)తో చేతులు కలిపాడు.
పంజాబ్ డిజిపి వికె భవ్రా, పంజాబ్ పోలీస్ హెడ్క్వార్టర్స్లో విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. దాడికి ప్లాన్ చేసిన…దాడిలో పాల్గొన్నవారికి సామగ్రి అందించడం, షెల్టర్ ఇవ్వడంతో సపోర్టు చేసిన ఆరుగురినీ పోలీసులు అరెస్ట్ చేశారు. నిషాన్ సింగ్, జగ్దీప్ సింగ్ కాంగ్, కన్వర్జిత్ సింగ్ అలియాస్ కన్వర్ బాత్ (40), బల్జీందర్ సింగ్ అలియాస్ రాంబో (41), బల్జీత్ కౌర్ అలియాస్ సుఖి(50), సహా అనంత్ దీప్ సింగ్ అలియాస్ సోను(32)గా నిందితులుగా గుర్తించారు. వారి నుంచి రెండు కార్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబందించిన నిషాన్ను మే 11న ఆర్మ్స్ యాక్ట్ కేసులో ఫరీద్కోట్ పోలీసులు అరెస్టు చేశారు. కోర్టు అతనికి మే 16 వరకు రిమాండ్ విధించింది.
https://twitter.com/PunjabPoliceInd/status/1525111628248690689?s=20&t=qarV0R4jGB46zozvAHQ4rA
ఇంటెలిజెన్స్ హెడ్క్వార్టర్స్ లో ఆర్పిజి దాడి చేసేందుకు లండా.. నిషాన్ సహా అతని సహచరుడు చరత్ సింగ్ సహాయం తీసుకున్నారని.. స్థానిక నివాసి కావడంతో సోమవారం ఉదయం ఇంటెలిజెన్స్ ఆఫీస్ పై రెక్సీని నిర్వహించడంలో జగదీప్ చరత్కు సహాయం చేశారని డీజీపీ చెప్పారు. సోమవారం సాయంత్రం ఇంకా గుర్తించబడని చరత్ సహా అతని ఇద్దరు సహాయకులు రాత్రి 7.42 గంటలకు ఇంటెలిజెన్స్ హెడ్క్వార్టర్స్ పై RPG దాడి చేసినట్టు పోలీసులు తేల్చారు.
హత్యకేసులో జీవిత ఖైదు అనుభవిస్తూ పెరోల్పై బయటకు వచ్చిన చరత్ తోపాటు అతని ఇద్దరు సహచరులను అరెస్ట్ చేసేందుకు పంజాబ్ పోలీసులు గాలిస్తున్నారు. మిగతా వారినీ త్వరలోనే అరెస్ట్ చేస్తామంటున్నారు. ఇక బీహార్లోని ఔరయ్యా జిల్లా నివాసితులైన మహ్మద్ నసిమ్ ఆలం, మహ్మద్ షరాఫ్ రాజ్లను కూడా నోయిడా నుంచి విచారణ కోసం తీసుకువచ్చారు.