దేశవ్యాప్తంగా మహిళలు, బాలికలపై జరుగుతున్న నేరాలకు అంతం లేదనిపిస్తోంది. తెలంగాణలోని మహబూబ్నగర్ జిల్లాలో 13 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం జరిగింది. రెండు నెలల క్రితం లైంగిక దాడికి గురైన బాలిక గర్భం దాల్చడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
వైద్యులు బాలికను పరీక్షించి గర్భవతి అని తల్లిదండ్రులకు తెలిపారు. దీంతో బాధితురాలు తన తల్లిదండ్రులకు ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం పోలీసులు ఇందుకు సంబంధించిన ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసి జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు.
నిందితులను గొల్ల రవికుమార్, గడ్డం శ్రీకాంత్గా గుర్తించారు. అమ్మాయి తల్లిదండ్రులు జూన్ 6న కోయిలకొండ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ అరెస్టులు జరిగాయి. నిందితుడు గొల్ల రవి బాలికతో స్నేహం చేశాడని ఆరోపణలు వచ్చాయి. అనంతరం శ్రీకాంత్తో కలిసి బాలిక ఇంటికి వెళ్లి బాలికపై సామూహిక అత్యాచారం చేశారు.
రెండు నెలల క్రితమే నేరం జరిగినా బాలిక తల్లిదండ్రులకు చెప్పలేదు. బాలిక ఆరోగ్యం బాగోలేదని పదే పదే అంటుండంతో, అలాగే రుతుక్రమం రాకపోవడంతో ఆమె తల్లి ఆస్పత్రికి తీసుకెళ్లింది.
బాలిక గర్భం దాల్చినట్లు వైద్యులు నిర్ధారించిన వెంటనే బాధితురాలి తల్లి పోలీసులను ఆశ్రయించి ఇద్దరు యువకులపై ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు అనంతరం బాలికను శిశు సంక్షేమ కమిటీకి అప్పగించారు. బాలిక ఎంతకాలం వారి సంరక్షణలో ఉండాలనేది కమిటీ నిర్ణయిస్తుంది. ప్రస్తుతం బాలికను జిల్లా షెల్టర్ హోమ్కు తరలించనున్నారు.