గాంధీ మునిమనవరాలికి ఏడేళ్ల జైలు శిక్ష పడింది.మహాత్మా గాంధీ మునిమనవరాలు ఆశిష్ లతా రామ్ గోబిన్ ( 56 ) ఫోర్జరీ కేసులో అరెస్టైంది. విచారణ అనంతరం కోర్టు ఆమెకు ఏడేళ్ల శిక్ష వేసింది. ఫోర్జరీ కేసులో 3కోట్ల,30లక్షల రూపాయల మోసానికి పాల్పడ్డారని సౌతాఫ్రికా కోర్టు నిర్ధారించింది . SR మహరాజ్ అనే వ్యాపారవేత్తను ఆమె మోసం చేసినట్లు తేలింది . ఇండియా నుంచి వచ్చే కన్ సైన్మెంట్ కోసం కస్టమ్స్ డ్యూటీ చెల్లించేందుకు మహరాజ్ ఆమెకు రూ .3.3 కోట్ల అడ్వాన్స్ చెల్లించారు . అసలు కన్ సైన్ మెంటే లేదని , నకిలీ బిల్లులు సృష్టించినట్లు విచారణలో తేలడంతో ఆమెకు శిక్షవేసింది.