తన తండ్రి నేతాజీ సుభాష్ చంద్రబోస్ కు, మహాత్మాగాంధీకి మధ్య క్లిష్టమైన సంబంధం ఉండేదని నేతాజీ తనయ అనితా బోస్ అన్నారు. నేతాజీని తాను నియంత్రించలేనని గాంధీ భావించారని…అయితే గాంధీకి నేతాజీ గొప్ప ఆరాధకుడనీ అన్నారు. గాంధీ నెహ్రూలు నేతాజీని బ్రిటీష్ పాలకులకు అప్పగించాలనుకున్నారని కంగనారనౌత్ వ్యాఖ్యానించిన సందర్బంగా ఓ వార్తాపత్రిక అడిగిన ప్రశ్నకు అనిత ఇలా సమాధానాలిచ్చారు.
గాంధీ, నేతాజీలిద్దరూ స్వాతంత్ర్యం కోసం పోరాడిన యోధులని అన్నారు. కొందరు కాంగ్రెస్ వాదులు ముందునుంచీ ప్రచారం చేస్తున్నట్టు కేవలం అహింసావిధానం వల్లే స్వాతంత్ర్యం రాలేదన్నారు. నేతీజీ ఇండియన్ నేషనల్ ఆర్మీ స్థాపన స్వాతంత్ర్యం రావడానికి దోహదపడిందనీ అనిత అన్నారు. మరోవైపు నేతాజీ ఐఎన్ఏ వల్లనే దేశానికి స్వాతంత్యం వచ్చిందనీ అనలేమని… నేతాజీతో పాటు ఎందరో స్వాంతంత్ర్య సముపార్జనలో భాగమయ్యారనీ గుర్తు చేశారు. స్వాతంత్ర్య ఫలితాన్ని ఏకపక్షంగా చూడడం అమాయకమన్నారు.
నేతాజీకి, భగత్ సింగ్ కు మహాత్మాగాంధీ నుంచి ఎలాంటి మద్దతూ లభించలేదని తన ఇన్ స్టా వేదిగ్గా కంగనా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి. ఒక చెంపమీద కొడితే రెండోచెప్ప చూపడం వల్ల స్వాతంత్ర్యం రాలేదంటూ వ్యంగ్యంగా అన్నారు. అది భిక్ష మాత్రమే అవుతుందని…2014లో భారత్ కు అసలైన స్వాతంత్ర్యం వచ్చిందని కంగనా అన్నారు. తన ఇన్స్టాగ్రామ్ కథనాలలో కంగనా…. మహాత్మా గాంధీని లక్ష్యంగా చేసుకుని “మీ హీరోలను తెలివిగా ఎన్నుకోండి” అని అన్నారు.