
ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (FATF)అనేది మనీ లాండరింగ్ను ఎదుర్కోవడానికి సంబంధించిన విధానాలను అభివృద్ధి చేయడానికి G7 దేశాల చొరవతో 1989లో స్థాపించబడిన ఒక అంతర ప్రభుత్వ సంస్థ. తీవ్రవాదానికి ఆర్థిక సహాయం అందించే దేశాల లిస్ట్ ఒకటి తాయారు చేసి ఆ దేశాలపై ఇది కఠిన ఆంక్షలు విధిస్తుంది. గత కొద్ది సం. లుగా పాకిస్తాన్ దేశం ఈ FATF తో ఇబ్బందులు ఎదుర్కొంటోంది.
అయితే, ఈ మధ్య వివిధ దేశాల నిఘా సంస్థలు ఇచ్చిన సమాచారం ఆధారంగా ఈ FATF సంస్థ మనీ లాండరింగ్ అంటే ఏమిటో చెపుతూ వాటిలో ఒక 70 కేస్ స్టడీ లను ఉదాహరణలుగా చూపించింది.
ఆ కేస్ స్టడీ లలో ఒక ఉదాహరణ చెపుతూ..
Mr A” ఒక భారతీయ బ్యాంకు యొక్క CEO, అతను ఉద్దేశపూర్వకంగా నిబంధనలను ఉల్లంఘిస్తూ, నష్టాలను ఎదుర్కొంటున్న వ్యాపార సంస్థలకు లేదా ప్రతికూల పరిస్థితులు ఉన్న వ్యాపార సంస్ధలకు $628 మిలియన్లకు సమానమైన రుణాలను మంజూరు చేయడం ద్వారా తన పదవిని దుర్వినియోగం చేశాడు.
“Mr A” ప్రభుత్వం నుండి అవార్డులు అందుకోవడానికి కిక్ బ్యాక్లు చెల్లించడానికి రాజకీయ నాయకుల నుండి ఒక పెయింటింగ్ కొనుగోలు చేసాడు. అతను పాలకపక్ష సభ్యుని దగ్గరి బంధువు నుండి ₹2కోట్లు చెల్లించి ఆ కళాఖండాన్ని కొనుగోలు చేశాడు. “ఇది చాలా ఎక్కువ ధర అంటే ఓవర్ వాల్యుయేషన్ అని మరియు చెల్లించిన ధర ఆ పెయింటింగ్ కోసం కాదని, అతనికి ‘పద్మ భూషణ్’ అవార్డును ప్రభావితం చేయడానికి లంచం అని దర్యాప్తులో తేలింది” అని నివేదిక పేర్కొంది.
ఇంతకీ ఈ ఉదాహరణ లో A అనే వ్యక్తి వేరెవరో కాదు. మూడు సం.ల క్రిందట దివాలా అంచులకు చేరిన “యెస్ బాంక్” చైర్మన్ రానా కపూర్.(A)
పెయింటింగ్ ఏమిటంటే వివాస్పద చిత్రకారుడు MF హుసైన్ వేసిన రాజీవ్ గాంధీ పెయింటింగ్.
ఆ పెయింటింగ్ రాజీవ్ కూతురు ప్రియాంకా వాద్రా (B) నుండి ₹2కోట్లు చెల్లించి రానా కపూర్ కొనుగోలు చేసాడు.
ఈ పెయింటింగ్ ని ప్రియాంకా నుండి కొనుగోలు చేయాల్సిందిగా మహారాష్ట్ర కాంగ్రెస్ ఎంపీ మిలింద్ దేవరా రానా కపూర్ పై చాలా వత్తిడి తెచ్చాడు. ఒక సమయంలో మిలింద్ దేవరా డీల్ ఆలస్యం అవుతూ ఉండటం వల్ల సోనియా కుటుంబ సభ్యులు బాగా అప్ సెట్ అయ్యారు అని వెంటనే డబ్బులు చెల్లించి పెయింటింగ్ కొనుగోలు చేయమని రానా కపూర్ కి మెసేజ్ కూడా పెట్టాడు.
ఈ విషయాలు అన్ని ఈడీ విచారణలో రానా కపూర్ స్వయంగా చెప్పాడు. తను సోనియాగాంధీ కుటుంబానికి సాయం చేస్తే తనకు పద్మ విభూషన్ అవార్డ్ కూడా ఇప్పిస్తామని సోనియా అంతరంగిక వ్యక్తి అహమ్మద్ పటేల్ చెప్పారు అని రానా కపూర్ వెల్లడించాడు. ఈడీ సేకరించిన ఫోన్ మెసేజి లలో ఈ వివరాలు లభ్యం అయ్యాయి.
2020లో ప్రముఖ కొత్త తరం ప్రైవేట్ బాంక్ “యెస్ బాంక్” సుమారు దివాలా స్థితికి చేరింది.
దాని సీఎండీ రానా కపూర్ రూల్స్ సరిగ్గా పాటించకుండా విచ్చలవిడిగా లోన్లు ఇచ్చాడు, మని లాండరింగ్ చేసాడు అని సీబీఐ మరియు ఈడీ కేసులు పెట్టి 2021 జనవరిలో అరెస్ట్ చేశారు 2021 నవంబర్ లో బెయిల్ దొరికింది.
కేసు ఇంకా విచారణలో ఉంది.
విచిత్రం ఏమిటంటే, సాధారణంగా లంచం ఇచ్చిన వాళ్ళకంటే ముందు లంచం తీసుకున్న వాళ్లపై చర్యలు ఉంటాయి. అయితే ఇక్కడ ప్రియాంకా గాంధీకి పరోక్షంగా లంచం ఇచ్చిన రానా కపూర్ మీద వేరే కేసులో చర్య తీసుకుని అరెస్టు చేయబడి సుమారు 2సం. లు జైల్లో ఉంటే, ఇప్పటి వరకు ఇంకా ప్రియాంక ను ED ప్రశ్నించలేదు.. బహుశా ఇప్పుడు ఇక చర్యలు ఉంటాయేమో? చర్యలు ఉన్నా ఏముంది?
వాళ్ళ అమ్మ , సోదరుడి లాగా బెయిల్ తీసుకుని బెయిల్ మీద బయట తిరుగుతారు.
….చాడా శాస్త్రి….