అసెంబ్లీ ఎన్నికల ముంగిట కర్ణాటకలో కొత్త పార్టీ ఆవిర్భవించింది. మైనింగ్ దిగ్గజం గాలి జనార్దన్ రెడ్డి బీజేపీకి షాకిస్తూ సొంత పార్టీ పెట్టుకున్నారు. కల్యాణరాజ్య ప్రగతి పక్ష పార్టీని ప్రకటించారాయన. వచ్చేఎన్నికల్లో గంగావతి నియోజకవర్గం నుంచి పోటీచేస్తాననీ చెప్పారు. ప్రచారం ప్రారంభిస్తానని ఇక ఇంటింటికీ వెళ్తానని ఆయన తెలిపారు. ఇప్పుడున్న పార్టీలు తన స్వార్థప్రయోజనాల కోసం ప్రజలను విడగొడ్తున్నారని ఆవేదన వ్యక్తం చేసిన ఆయన…కన్నడ ప్రజలు ఐక్యంగా ఉన్నారని చెప్పుకొచ్చారు. గనుల అక్రమమైనింగ్ వ్యవహారంలో ఆయన గతంలో జైలుకు వెళ్లిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన ఆకేసులో బెయిల్ మీద బయట ఉన్నారు. ఆయనకు షరతులతో కూడిన బెయిల్ ఇచ్చిన సుప్రీంకోర్టు… పాస్పోర్టులను అప్పగించాలని, తమ అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లరాదని ఆదేశించింది. అంతేకాదు, బళ్లారి, అనంతపురం, కడప వెళ్లడాన్ని కూడా నిషేధించింది.