భారత వాయుసేన మరింత బలోపేతం అవుతోంది. స్పెయిన్కు చెందిన ఎయిర్బస్ డిఫెన్స్ అండ్ స్పేస్తో రక్షణ మంత్రిత్వ శాఖ కీలక ఒప్పందం కుదుర్చుకుంది. 20వేల కోట్ల విలువైన కాంట్రాక్టులో భాగంగా 56 సీ-295 మీడియం ట్రాన్స్పోర్టు విమానాలను కొనుగోలు చేస్తోంది.
16 విమానాలను ఫ్లైఅవే కండిషన్లో 48 నెలల్లోగా మన దేశానికి ఎయిర్బస్ అందజేస్తుంది. మిగిలిన 40 విమానాలను మన దేశంలోనే తయారు చేస్తారు. ఎయిర్బస్ డిఫెన్స్ అండ్ స్పేస్, టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్ కన్సార్షియం తయారు చేస్తుంది. వీటిని ఈ ఒప్పందంపై సంతకాలు జరిగినప్పటి నుంచి పదేళ్ళలో తయారు చేసి, అందజేస్తాయి. సైనిక విమానాలను ఓ ప్రైవేటు కంపెనీ మన దేశంలో తయారు చేయడం ఇదే మొదటిసారి.
అవ్రో-748 విమానాలకు స్థానంలో అవి ఉంటాయి. భారత వాయుసేన కోసం 56సీ-295 విమానాలు సేకరించాలన్న ప్రతిపాదనకు కేబినెట్ కమిటీ రెండు వారాల క్రితమే ఆమోదం తెలిపింది. ఈసీ-295 ఎండబ్ల్యూ విమానం 5-10 టన్నుల సరుకును రవాణా చేయగలదు. అవ్రో-748 విమానాలను మార్చాలనే నిర్ణయం తొమ్మిదేళ్ళ క్రితం జరిగింది.