నిధులపై నిగ్గుతేలిన నిజం
కరోనా సమయంలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ఏమీ ఇవ్వలేదనే ఆరోపణల్లో నిజం లేదని తేలిపోయింది. వరదల సమయంలో, అలాగే కరోనా కాలంలో కేంద్రం చిన్నచూపు చూసిందని ముఖ్యమంత్రితో పాటు మంత్రులు ఇతర టిఆర్ ఎస్ నేతలు ఆరోపణలు గుప్పించారు. కానీ అది నిజం కాదని కేంద్ర ఆర్థిక శాఖ తెలిపిన గణాంకాలు చాటిచెప్పాయి. రాజ్యసభలో కేంద్ర ఆర్థిక మంత్రి అనురాగ్ ఠాకూర్ ఈ మేరకు సమాధానం ఇచ్చారు.
అధికారికంగా కేంద్రం తెలిపిన సమాచారం ప్రకారం కరోనా కాలంలో కేంద్రం తెలంగాణకు మొత్తం మీద 10 వేల 543 కోట్ల 81 లక్షల రూపాయలు ఇచ్చింది. వివిధ పథకాల కింద ఈ మొత్తం తెలంగాణకు అందింది. వైద్య ఆరోగ్య మౌలిక సదుపాయా మెరుగుదలతో పాటు ఇంకా అనేక లక్ష్యాలతో కేంద్రం ఈ నిధులు ఇచ్చింది. 10 వేల కోట్ల రూపాయలకు పైగా నిధులు ఇచ్చినా ఏమీ ఇవ్వలేదని బద్నాం చేయడం బాధాకరం.
నరేంద్ర మోడీ ప్రధాన మంత్రి అయిన తర్వాత రాష్ట్రాలకు ఏమాత్రం వివక్ష లేకుండా నిధులు ఇస్తున్నారు. గతంలో అనేక సందర్భాల్లో కేంద్ర ప్రభుత్వ పెద్దలు సొంత పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాలకే నిధులు ఉదారంగా ఇచ్చే వారు. మోడీ జమానాలో అలా జరగడం లేదు. సబ్ కా సాథ్ సబ్ కా వికాస్ అనే మాటను ఆచరణలో చూపుతున్నారు మోడీ. తెలంగాణ ప్రజలకు వాస్తవాలు తెలియకుండా ప్రయత్నాలు జరుగుతుంటే దాన్ని అడ్డుకోవాల్సిన అవసరం ఉంది. వాస్తవాలు ప్రజలు తెలియాలి. తెలంగాణలోని దాదాపు ప్రతి పథకానికి కేంద్ర ప్రభుత్వ నిధులు అందుతున్నాయని బిజెపి నాయకులు చెప్తున్నారు. టిఆర్ ఎస్ నాయకులు ఖండిస్తున్నారు. కాబట్టి కేంద్రమే పూర్తి వివరాలను తెలపాలి. లేదా బిజెపి నేతలు అధికారిక సమాచారం సేకరించి ప్రజల ముందుంచాల్సిన అవసరం ఉంది.