జిహాదీల చేతిలో దారుణ హత్యకు గురైన రాజస్థాన్ కు చెందిన కన్నయ్య కుమార్ కు మద్దతుగా దేశంలోని హిందూసమాజం నిలబడింది. ఆయన కుటుంబం కోసం నిధుల సేకరణ ప్రారంభించగా అనూహ్య స్పందన వచ్చింది. 24 గంటల్లో కోటీ 70 లక్షల రూపాయలు జమయ్యాయి. ఆ మొత్తంలో కోటి రూపాయలను వారి కుటుంబసభ్యుల అకౌంట్లోకి జమ చేశారు. ఈ విషయాన్ని బీజేపీ ఎమ్మెల్యే కపిల్ మిశ్రా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.
कन्हैया लाल जी की धर्मपत्नी के खाते में आपके दिए एक करोड़ रुपये पहुंच गए हैं
₹ One Crore credited to the bank account of wife of Kanhaiya lal ji 🙏#HinduEcosystem pic.twitter.com/L2cB01yeK4
— Kapil Mishra (@KapilMishra_IND) July 6, 2022
కన్నయ్య లాల్ భార్య బ్యాంక్ ఖాతాకు కోటి జమచేశామంటూ ఆయన ట్వీట్ చేస్తూ ట్రాన్సాక్షన్ వివరాల్ని సైతం షేర్ చేశారు. నూపుర్ శర్మకు మద్దతు ఇచ్చినందుకు కపిల్ మిశ్రా ఉదయపూర్లో ఇస్లాంవాదులు కన్నయ్య తల నరికిన సంగతి తెలిసిందే. ఆయన హత్యతో ఆ కుటుంబం దిక్కులేనిదైంది. ఆయన భార్య ఇద్దరుకుమారుల బాధ్యత తీసుకునేందుకు కపిల్ మిశ్రా ముందుకు వచ్చారు. అందుకోసం నిధుల సేకరణ డ్రైవ్ ప్రారంభించారు. అందుకోసం దేశవాసుల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. 24 గంటల్లోపే కోటి రూపాయలు వచ్చాయి. అయితే కన్నయ్యను రక్షించే ప్రయత్నంలో గాయపడిన ఈశ్వర్ గౌడ్ కోసం ఆ మొత్తాన్ని కోటీ 25 లక్షలకు పెంచారు. సవరించిన తరువాత మరింత రెస్పాన్స్ వచ్చింది. మొత్తంగా కోటీ 70 లక్షలు వచ్చాయి. ఇక నూపుర్ కు మద్దతు ఇచ్చాడనే కారణంతోనే మహారాష్ట్ర అమరావతికి చెందిన ఉమేశ్ కోల్హేను ఇస్లామిస్టులు నరికి చంపిన విషయం తెలిసిందే. ఆయన కుటుంబానికి కూడా 30 లక్షల ఆర్థికసాయం అందజేయనున్నట్టు కపిల్ మిశ్రా ప్రకటించారు. న్యాయ పోరాటం చేసేందుకు కోల్హే కుటుంబానికి సహాయం చేస్తానని కపిల్ మిశ్రా తన ట్వీట్లో హామీ ఇచ్చారు. రాజస్థాన్లో విధి నిర్వహణలో మూకదాడిలో గాయపడిన కానిస్టేబుల్ కు కూడా 5 లక్షలు అందజేయనున్నారు. మిగిలిన ఇతర మొత్తాన్ని కన్నయ్య కుటుంబానికే ఇస్తామని కపిల్ తెలిపారు.
कल अमरावती में उमेश कोल्हे जी के परिवार से मिलूंगा
हम उनके परिवार को ₹ 30 लाख की सहायता दे रहे हैं
कानूनी लड़ाई में भी हमेशा साथ खड़े रहेंगे#HinduEcosystem
— Kapil Mishra (@KapilMishra_IND) July 6, 2022