ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉత్తరప్రదేశ్లోని ఝాన్సీలో పర్యటించనున్నారు. ఆయన పర్యటన రక్షణ రంగంలో భారతదేశపు స్వావలంబనకు భారీ ఊతాన్ని ఇవ్వనుంది. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకల్లో భాగంగా నిర్వహిస్తున్న రాష్ట్ర రక్ష సంపర్పణ్ కార్యక్రమంలో స్వదేశీయంగా రూపొందించి అభివృద్ధి చేసిన పరికరాలను. త్రివిధ దళాల అధిపతులకు అందజేయనున్నారు. వీటిలో తేలికపాటి యుద్ధ హెలికాప్టర్లు, డ్రోన్లు, అడ్వాన్స్డ్ ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సూట్ లు ఉన్నాయి.