వర్క్ ఫ్రం హోమ్ విధానానికి సంపూర్ణంగా ముగింపు పలుకుతోంది టీసీఎస్ కంపెనీ. ప్రతిఒక్కరూ తిరిగి ఆఫీస్కు వచ్చి పనిచేయాలని స్పష్టంచేసింది.ప్రపంచంలోని పలు దేశాల్లో కొవిడ్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా ఆఫీసుల్లో తగిన జాగ్రత్త చర్యలు ఉంటాయని సంస్థ హామీ ఇచ్చింది. ఉద్యోగులకు తగిన వెసులుబాటు కల్పిస్తామని, అయినప్పటికీ హైబ్రీడ్ వర్క్ విధానానమే అని స్పష్టం చేసింది.
కాగా వారంలో కనీసం మూడు రోజులైనా ఆఫీస్ నుంచి పనిచేయాలంటూ ఉద్యోగులందరికీ గతేడాది ఈ-మెయిల్ ద్వారా కంపెనీ సమాచారమిచ్చింది. టీమ్ సూపర్వైజర్ నిర్ణయించే రోస్టర్ ప్రకారం వచ్చి ఆఫీస్లో పనిచేయాలని తెలిపిన విషయం తెలిసిందే. టీసీఎస్ సీనియర్లు కొంతకాలంగా ఆఫీస్ నుంచి పనిచేస్తుండడంతో కస్టమర్ల కూడా కార్యాలయాలను సందర్శిస్తున్నారని ఈ-మెయిల్స్లో వివరించింది.