తన ప్రియురాలు తనకు దక్కదేమోనన్న అనుమానంతో ఆమెకు సన్నిహితంగా ఉంటున్న స్నేహితుడినే హత్య చేసిన ఘటన కలకలం రేపుతోంది. మహాత్మాగాంధీ యూనివర్సిటీలో చదువుతున్న నవీన్ అనే యువకుడిని అక్కడే చదువుతున్న హరిహర అతి కిరాతకంగా హత్య చేశాడు. తన ప్రియురాలు అతనితో సన్నిహితంగా ఉంటుండడమే కారణం. కొన్నిరోజులుగా అతనిపై కక్ష పెంచుకున్న హరిహర ఈనెల 17న అతన్ని నగర శివారుకు పిలిపించుకుని చంపేసి గుట్టల్లో పడేసి వెళ్లాడు. కుమారుడు అదృశ్యమయ్యాడని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేసిన పోలీసులు నగర శివారులో నవీన్ మృతదేహాన్ని గుర్తించారు. నేరాన్ని హరిహర ఒప్పుకున్నట్టు పోలీసులు తెలిపారు. అయితే దర్యాప్తు కొనసాగుతోందని… హరికృష్ణను అరెస్ట్ చేశామని…నవీన్ ను అతనొక్కడే హత్య చేశాడా మరెవరి సాయం అయినా తీసుకున్నాడా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.అటు నవీన్ ప్రియురాలి ప్రమేయం ఎంతవరకు ఉందనేదానిపైనా విచారణ చేస్తున్నారు.చేతికి అందివచ్చిన కొడుకు ఇలా స్నేహితుడిచేతిలోనే హత్యకు గురవడం చూసి ఆ కన్నతల్లి రోదిస్తున్న తీరు కలచివేస్తోందది.