మహారాష్ట్ర నూపుర్ శర్మకు మద్దతు ఇచ్చినందుకు ఫార్మసిస్ట్ ఉమేష్ కొల్హేను దారుణంగా హత్య చేసిన కేసులో మరో ఇద్దరు నిందితులను అరెస్టు చేయడంతో, అతనికి తెలిసిన వ్యక్తులచే అతడు హత్యకు గురయ్యాడని ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. నూపుర్ శర్మకు కన్హయ్య లాల్ మద్దతును అతని పొరుగున ఉన్న నజీమ్ హైలైట్ చేయడంతో.. ఉదయ్ పూర్లో కన్హయ్య తలా నరకడానికి దారితీసింది, కోల్హే హత్య కేసులో కూడా అతని స్నేహితుడైన వెటర్నరీ డాక్టర్ యూసుఫ్ ఖాన్ ప్రేరేపించడంతో హంతకులు అతన్ని చంపేశారు. ఈ విషయాన్ని బాధితుడు ఉమేష్ కోల్హే సోదరుడు మహేష్ కోల్హే వెల్లడించారు. పశువైద్యుడు యూసుఫ్ ఖాన్తో ఉమేష్ కోల్హే మంచి స్నేహితుడని, తమకు 2006 నుంచి ఖాన్ పరిచయం అని మహేష్ కోల్హే తెలిపారు. ఈ కేసులో ప్రమేయం ఉన్నందున అమరావతిలో అతన్ని పోలీసులు అరెస్ట్ చేశారు.
ఈ కేసులో ప్రధాన సూత్రధారుడిని అరెస్టు చేయడంతో దర్యాప్తు వేగవంతం అవుతుందని.. మరికొందరిని కూడా అరెస్టు చేస్తారనిమహేష్ కోల్హే ఆశాభావం వ్యక్తం చేశారు. ఫాస్ట్ట్రాక్ కోర్టులో విచారణ జరిపి గరిష్టంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
Through the Police note, we found out that my brother was murdered over his post on Nupur Sharma…He was good friends with Yusuf Khan (arrested accused), a practicing veterinarian. We knew him since 2006: Mahesh Kolhe, brother of Umesh Kolhe murdered in Amravati, Maharashtra pic.twitter.com/HfhunszBRO
— ANI (@ANI) July 3, 2022
ఈ కేసులో హంతకులు సహా 5 మందిని పోలీసులు ఇప్పటికే అరెస్టు చేయగా, నిన్న మరో ఇద్దరు నిందితుల (వెటర్నరీ డాక్టర్ యూసుఫ్ ఖాన్ బహదూర్ ఖాన్, ఎన్జీవో నడుపుతున్న మాస్టర్ మైండ్ షేక్ ఇర్ఫాన్ షేక్ రహీమ్)ను అరెస్టు చేశారు.
నూపుర్ శర్మకు మద్దతు ఇస్తూ ఉమేష్ కోల్హే మెసేజ్ ను యూసుఫ్ ఖాన్ వాట్సాప్ గ్రూపులలో ఫార్వార్డ్ చేసాడు, అతనిపై ఇస్లామిస్టులను రెచ్చగొట్టాడు. “ఖాన్ నిందితులను ప్రేరేపించాడు” అని పోలీసులు చెప్పారు.
హత్యానంతరం ఉమేష్ కోల్హే అంత్యక్రియలకు ఖాన్ హాజరైనట్లు సమాచారం. మరోవైపు నాగ్పూర్లో అరెస్టయిన ఇర్ఫాన్ షేక్ హంతకులకు నగదు, రవాణా సహాయాన్ని అందించాడు. హంతకులకు ఒక్కొక్కరికి ₹10,000 ఇస్తానని, కారులో సురక్షితంగా తప్పించుకోవడానికి సహాయం చేస్తానని వాగ్దానం చేశాడు.
ఉమేష్ కోల్హే హత్య దాదాపు రెండు వారాల క్రితం జరిగింది, కానీ నిన్ననే స్థానిక పోలీసులు నూపుర్ శర్మకు మద్దతు ఇచ్చినందుకు హత్య జరిగినట్టు వెల్లడించడం గమనార్హం. అంతకుముందు ఇది దోపిడీ కేసు అని పోలీసులు వాదించారు. అయితే ఈ కేసును కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఎన్ఐఏకి అప్పగించింది, మరోవైపు మహారాష్ట్రలో ప్రభుత్వం మారింది, దీంతో హత్యకు అసలు కారణాన్ని పోలీసులు ఎట్టకేలకు అంగీకరించారు.