రెండోసారి ప్రమాణం చేసిన యూపీ సీఎం ఆదిత్యనాథ్ యోగీ మరునాడే కీలక నిర్ణయం తీసుకున్నారు. సబ్ కా సాథ్, సబ్ కా వికాసే తమ ప్రభుత్వ నినాదం, విధానం అని చాటిచెబుతూ ఉచిత రేషన్ బియ్యాన్ని వచ్చే మూడునెలలు పొడిగిస్తున్నట్టు ప్రకటించారు. తొలి కేబినెట్ సమావేశంలోనే చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నారు యోగీ. తద్వారా రాష్ట్రంలోని 15 కోట్ల మంది ప్రజలకు ప్రయోజనం చేకూరనుంది. ఇంటికి నెలకు 5 కిలోల ధాన్యం అదనంగా లభిస్తుందని ప్రభుత్వం ప్రకటించింది.