ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం రక్షా బంధన్ కానుకగా 48 గంటల పాటు రాష్ట్రవ్యాప్తంగా మహిళలకు ఉచిత బస్సు సర్వీసులను ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా మహిళలు ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్ర రవాణా సంస్థ (UPSRTC) ద్వారా ఆగస్టు 10 అర్ధరాత్రి నుంచి 12 అర్ధరాత్రి వరకు 48 గంటల పాటు ఉచితంగా ప్రయాణించే వెసులుబాటు కల్పించింది. యూపీ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు సర్వీసులు అందించడం ఇదే తొలిసారి కాదు. ప్రతి సంవత్సరం, రక్షా బంధన్ పండుగ సందర్భంగా UPSRTC మహిళా ప్రయాణీకులకు ఉచిత ప్రయాణ సేవలను అందిస్తుంది. ప్రతి సంవత్సరం దాదాపు 8-10 లక్షల మంది మహిళలు ఈ సేవను పొందుతున్నారు.