ఆంధ్రప్రదేశ్ ఆడపడుచులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలియజేసింది. సూపర్ సిక్స్ గ్యారంటీల్లో ప్రధానమైన హామీ అయిన మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం మీద స్పష్టత వచ్చేసింది. ఆగస్టు 15వ తేదీన దీనికి ముహూర్తంగా రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది
ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా తెలియజేశారు.కర్నూలులో ఏర్పాటు చేసిన స్వర్ణాధ్రం..స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఆయన ఈ విషయం ప్రకటించారు. మహిళల అభ్యున్నతికి తాము కట్టుబడి ఉన్నామని చంద్రబాబు వివరించారు ఇందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ ఆడపడుచులు అందరికీ ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం సౌకర్యం కల్పిస్తున్నామని పేర్కొన్నారు.
మహిళా సాధికారతకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని చంద్రబాబు విశ్లేషించారు. ఏడాదిలో లక్ష మంది డ్వాక్రా మహిళలను పారిశ్రామిక వేత్తలుగా మారుస్తానని సీఎం హామీ ఇచ్చారు. ప్రతి నెలా మూడో శనివారం స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొనాలని, పరిసరాలను శుభ్రం చేసుకోవాలన్నారు. పొడి చెత్త నుంచి విద్యుత్ తయారు చేస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే గుంటూరులో 16 మెగావాట్ల విద్యుత్ ప్లాంటు పనిచేస్తోందని త్వరలో రాజమహేంద్రవరం, విజయవాడ, నెల్లూరు,
కడపలో అందుబాటులోకి వస్తాయన్నారు.
మహిళలకు ఆర్టీసీ బస్సు ప్రయాణం మీద స్పష్టమైన ప్రకటన ఇచ్చినందుకు చంద్రబాబుకి ఏపీ మహిళలు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు.