ఆజాదీకా అమృత్ మహోత్సవాల వేళ కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కరోనాపై పోరులో భాగంగా 75 రోజులపాటు దేశప్రజలందరికి ఉచితంగా బూస్టర్ డోస్ వేయాలని నిర్ణయించింది. 18ఏల్లు నిండిన వాళ్లంతా జూలై 15నుంచి అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో కోవిడ్ బూస్టర్ డోస్లు వేయించుకోవచ్చని తెలిపింది. జూలై 15 నుంచి 75 రోజుల పాటు మూడో డోస్ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దేశ 75వ స్వాతంత్ర్య వేడుకలు జరుపుకొంటున్న తరుణంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు.