మన కమ్యూనిస్టు యూనియన్ల కుట్రలు కొత్తేం కాదు కానీ. పదే పదే ఈ దేశంలోని ఫ్యాక్టరీలు మూతపడడానికి వాళ్లు చేయాల్సింది చేస్తుంటారు. తాజాగా చెన్నైలోని ఫాస్కాం అంటే భారత్ లో ఐఫోన్స్ తయారు చేసే సంస్థలో ఉద్యోగుల మెస్ లో ఫుడ్ పాయిజనింగ్ అయింది. కొందరు ఉద్యోగులు అనారోగ్యం పాలయ్యారు. దీంతో కార్మికులు ఆందోళనకు దిగారు. అంతే వాళ్ల నిరసనలతో యాజమాన్యం తాత్కాలికంగా ఫ్యాక్టరీని మూసేసింది. ఉత్పత్తి ఆగిపోయింది. ఈ ప్రభావం వారు అభిమానించే చైనాలో పడింది. భారత్ లో ఉత్పత్తి నిలిచింది కనుక…చైనాలోని ఫాస్కాం కంపెనీల్లో భారీగా జీతాలు పెంచి… బోనస్ లు ఇస్తున్నాయి. కొత్త నియామకాలు జరుగుతున్నాయి.
గతేడాది బెంగళూరు ఫాస్కాం కంపెనీలోనూ అంతే… ఉద్యోగులు చిన్న కారణానికే విధ్వంసం చేశారు. దీంతో కొన్ని ఫ్యాక్టరీలు మూతపడ్డాయి. చెన్నైలో కొన్ని నెలలు క్రిందట కోవిడ్ వాక్సిన్ తయారు చేస్తున్న సీరం ఇన్స్టిట్యూట్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. అన్ని వేరువేరు ఘటనల్లా కనిపిస్తాయి కానీ మేక్ ఇన్ ఇండియాపై కొన్ని దేశాలకు కడుపుమంట అని అర్థం చేసుకోవచ్చు. ఇక్కడి కమ్యూనిస్టు యూనియన్లకు వారికి సహకరించే వ్యక్తులు, సంస్థలు , ఎన్జీవోలు మనదేశంలో పుష్కలంగా ఉన్నాయి.